ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ నెల 28న క‌రియ‌ప్ప మైదానం లో ఎన్‌సిసి ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 27 JAN 2021 4:34PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 28న దిల్లీ లోని క‌రియ‌ప్ప మైదానం లో నేశ‌న‌ల్ కేడెట్ కోర్ కు సంబంధించిన ర్యాలీ ని ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్నారు.  ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ల‌తో పాటు త్రివిధ సాయుధ ద‌ళాల ప్రధాన అధికారులు కూడా హాజ‌రు అవుతారు.

ఈ కార్య‌క్ర‌మం లో భాగంగా ఏర్పాటు చేసే గౌర‌వ వంద‌నాన్ని ప్ర‌ధాన మంత్రి ప‌రిశీలించి, ఎన్‌సిసి ద‌ళాలు చేసే క‌వాతు ను స‌మీక్షిస్తారు.  అంతేకాకుండా, ఈ కార్యక్రమంలో భాగం గా ఏర్పాటు చేస్తున్న ఒక సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌ ను కూడా ప్రధాన మంత్రి తిల‌కించనున్నారు.



 

*** 



(Release ID: 1692717) Visitor Counter : 141