ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ నెల 23న ప‌శ్చిమ బంగాల్‌ ను, అస‌మ్ ను సంద‌ర్శించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

నేతాజీ సుభాష్ చంద్ర‌ బోస్ 125వ జ‌యంతి సంవత్సరాన్ని స్మ‌రించుకోవ‌డానికి కోల్‌కాతా లో జ‌రిగే ‘ప‌రాక్ర‌మ్ దివ‌స్’ ఉత్స‌వాల‌ ను ఉద్దేశించి ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

అస‌మ్ లోని శివ‌సాగ‌ర్ లో ఒక ల‌క్ష‌ కు పైగా భూమి ప‌ట్టాల‌ ను కూడా ప్ర‌ధాన మంత్రి పంపిణీ చేస్తారు

Posted On: 21 JAN 2021 1:44PM by PIB Hyderabad

నేతాజీ సుభాష్ చంద్ర‌ బోస్ 125వ జ‌యంతి సంవ‌త్స‌రాన్ని స్మ‌రించుకోవ‌డానికి ఈ నెల 23 న కోల్‌కాతా లో నిర్వ‌హించే ‘ప‌రాక్ర‌మ్ దివ‌స్’ ఉత్స‌వాల‌ ను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించ‌నున్నారు.  ప్ర‌ధాన మంత్రి 1.06 ల‌క్ష‌ల భూమి ప‌ట్టాలు/ కేటాయింపు ధ్రువ ప‌త్రాల‌ ను పంపిణీ చేయ‌డానికి అస‌మ్ లోని శివ‌సాగ‌ర్ జిల్లా లో జెరెంగా పథర్ ను కూడా సంద‌ర్శిస్తారు

ప‌శ్చిమ బంగాల్ లో ప్ర‌ధాన మంత్రి

కోల్‌కాతా లోని విక్టోరియా స్మృతి చిహ్నం వ‌ద్ద నిర్వ‌హించే ‘ప‌రాక్ర‌మ్ దివ‌స్’ ప్రారంభ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి అధ్య‌క్ష‌త వ‌హిస్తారు.  నేతాజీ సుభాష్ చంద్ర‌ బోస్ అజేయ స్ఫూర్తి ని, దేశ ప్ర‌జ‌ల‌ కు ఆయ‌న చేసిన స్వార్ధ‌ ర‌హిత సేవ‌ల‌ ను గుర్తుకు తెచ్చి, సమ్మానించడానికి ఆయ‌న పుట్టిన రోజైన జ‌న‌వ‌రి 23వ తేదీని ప్రతి సంవత్సరం ‘ప‌రాక్ర‌మ్ దివ‌స్’ గా జర‌పాల‌ని భార‌త ప్ర‌భుత్వం నిర్ణయించింది.  ప్ర‌తికూల ప‌రిస్థితుల లో సైతం నేతాజీ ఎలా నిబ్బ‌రం గా వ్య‌వ‌హ‌రించారో ఆ స్ఫూర్తి ని దేశ ప్ర‌జ‌ల లో, ప్ర‌త్యేకించి యువ‌త‌ లో, నింపేటందుకు, దేశభ‌క్తి తాలూకు శ్ర‌ద్ధ‌ ను వారిలో ప్రోది చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టాలని ఉద్దేశించ‌డ‌ం జరిగింది.

నేతాజీ కి సంబంధించిన ఒక శాశ్వ‌త ప్ర‌ద‌ర్శ‌న ను, ఒక ప్రొజెక్ష‌న్ మ్యాపింగ్ షో ను ఈ సంద‌ర్భం లో మొద‌లుపెడతారు.  ఒక స్మార‌క నాణేన్ని, త‌పాలా బిళ్ళ‌ ను కూడా ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేయనున్నారు.  నేతాజీ ఇతివృత్తం గా ‘‘అమ్రా నూతొన్ జొబొనెరి దూత్‌’’ పేరు తో రూపొందించిన ఒక సాంస్కృతిక కార్య‌క్ర‌మాన్ని కూడా ప్రదర్శించడం జరుగుతుంది.

ఈ కార్య‌క్ర‌మం కంటే ముందు, ప్ర‌ధాన‌ మంత్రి కోల్‌కాతా లోని జాతీయ గ్రంథాల‌యానికి వెళ్తారు.  అక్క‌డ ‘‘రి-విజిటింగ్ ద లెగ‌సీ ఆఫ్ నేతాజీ సుభాష్ ఇన్ ద‌ ట్వంటీఫస్ట్ సెంచ‌రి’’ విషయం పై ఒక అంత‌ర్జాతీయ స‌మావేశాన్ని, క‌ళాకారుల శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.  స‌మావేశం లో పాలుపంచుకొనే వారి తోను, క‌ళాకారుల‌ తోను ప్రధాన మంత్రి మాట్లాడుతారు.

అస‌మ్ లో ప్ర‌ధాన ‌మంత్రి

ఆ రోజు ఇంతకంటే ముందుగా, ప్ర‌ధాన మంత్రి అస‌మ్ లోని శివ‌సాగ‌ర్ లో 1.06 ల‌క్ష‌ల భూమి ప‌ట్టాల‌ను/ కేటాయింపు ధ్రువ ప‌త్రాల‌ ను పంపిణీ చేస్తారు.  రాష్ట్రం లో స్వ‌దేశీ ప్ర‌జ‌ల భూమి హ‌క్కుల‌ ను ప‌రిర‌క్షించ‌వ‌ల‌సిన త‌క్ష‌ణ అవ‌స‌రాన్ని లెక్కలోకి తీసుకొని అస‌మ్ ప్ర‌భుత్వం ఒక నూతన సంపూర్ణ‌  భూమి విధానాన్ని తీసుకు వచ్చింది.  అస‌మ్ కు చెందిన స్థానికుల‌ కు ప‌ట్టాల కేటాయింపు ధ్రువ ప‌త్రాల ను జారీ చేయడానికి వారిలో భ‌ద్ర‌త భావ‌న ను నింప‌డానికి పెద్ద పీట ను వేయ‌డమైంది.  అస‌మ్ లో భూమి లేని కుటుంబాలు 2016వ సంవ‌త్స‌రం లో  5.75 ల‌క్ష‌లు గా ఉన్నాయి.  ప్ర‌స్తుత ప్ర‌భుత్వం 2016 మే నెల నుంచి 2.28 ల‌క్ష‌ల భూమి ప‌ట్టాల‌ను/ కేటాయింపు ధ్రువ ప‌త్రాల‌ ను వితరణ చేసింది.  ఈ నెల 23న జరపాలని తలపెట్టిన కార్య‌క్ర‌మం ఈ ప్ర‌క్రియ‌ లో త‌రువాతి అడుగు ను సూచిస్తున్నది.  
 


 

***


(Release ID: 1690876) Visitor Counter : 156