ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండోనేషియా విమాన ప్రమాద మృతులకు ప్రధానమంత్రి సంతాపం

Posted On: 10 JAN 2021 2:06PM by PIB Hyderabad

ఇండోనేషియా విమాన ప్రమాదంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో ‘‘ఇండోనేషియాలో దురదృష్టవశాత్తూ చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ఇండోనేషియాకు భారతదేశం అండగా నిలుస్తుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.

 

***



(Release ID: 1687532) Visitor Counter : 152