ప్రధాన మంత్రి కార్యాలయం
ఇజ్రాయల్ కు, యూదు ప్రజలకు హనుకాహ్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
10 DEC 2020 7:08PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హనుకాహ్ పర్వదినం సందర్భంలో ఇజ్రాయల్ కు, యూదు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
‘‘ఇజ్రాయల్ ప్రజలకు, ప్రపంచం అంతటా ఉన్న యూదు మిత్రులకు చాగ్ హనుకాహ్ సైమయిచ్. ఈ పండుగ మన జీవనంలో శాంతి ని, వెలుగు ను తీసుకువచ్చేటట్లు ఈశ్వరుడు అనుగ్రహించుగాక. అలాగే దీని ద్వారా మన ప్రజల మధ్యన సంబంధాలు మరింత బలపడుగాక’’ అని ఒక ట్వీట్ లో శ్రీ మోదీ పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి తన ట్వీట్ ను ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ కు, అధ్యక్షుడు శ్రీ రూవెన్ రివ్ లిన్ కు కూడా ట్యాగ్ చేశారు. దీనికి తోడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిబ్రూ భాషలో నూ ట్వీట్ చేశారు.
***
(Release ID: 1679909)
Visitor Counter : 95
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada