ప్రధాన మంత్రి కార్యాలయం

ఈ నెల 25న ల‌ఖ్‌న‌వూ విశ్వ‌విద్యాల‌యం శ‌త వార్షిక స్థాప‌న దినోత్స‌వానికి హాజ‌రుకానున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 23 NOV 2020 1:04PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 25న ల‌ఖ్‌న‌వూ విశ్వ‌విద్యాల‌యం శ‌త వార్షిక స్థాప‌న దినోత్స‌వం లో ఆ రోజు సాయంత్రం 5:30 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా పాలుపంచుకోనున్నారు.  ఈ విశ్వ‌విద్యాల‌యాన్ని 1920వ సంవ‌త్స‌రం లో స్థాపించ‌డం జ‌రిగింది.  ఇది త‌న 100వ‌ సంవ‌త్స‌ర ఉత్స‌వాన్ని జ‌రుపుకోనుంది.

ఈ సంద‌ర్భంలో విశ్వ‌విద్యాల‌య శ‌త వార్షిక స్మార‌క నాణేన్ని ప్ర‌ధాన మంత్రి ఆవిష్క‌రించనున్నారు. ఇండియా పోస్ట్ జారీ చేసే ఒక ప్ర‌త్యేక స్మార‌క త‌పాలా బిళ్ళ‌ను, అలాగే ఒక స్పెష‌ల్ క‌వ‌ర్‌ ను కూడా ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న విడుద‌ల చేస్తారు.  కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ ల‌తో పాటు, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి కూడా ఈ కార్య‌క్ర‌మం లో పాల్గొంటారు.


 

***
 



(Release ID: 1675043) Visitor Counter : 190