ప్రధాన మంత్రి కార్యాలయం

రాజస్థాన్ మంత్రి శ్రీ భన్వర్ లాల్ మేఘ్ వాల్ మృతికి సంతాపం వ్యక్తం చేసిన - ప్రధానమంత్రి

Posted On: 16 NOV 2020 8:02PM by PIB Hyderabad

రాజస్థాన్ కేబినెట్ మంత్రి శ్రీ భన్వర్ లాల్ మేఘ్ వాల్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.  

ఈ మేరకు శ్రీ మోదీ ఒక ట్వీట్ చేస్తూ, " రాజస్థాన్ కేబినెట్ మంత్రి శ్రీ భన్వర్ లాల్ మేఘ్ వాల్ జీ మరణం నాకెంతో విచారాన్ని కలిగించింది.  ఆయన రాజస్థాన్ ‌కు సేవ చేయడం పట్ల మక్కువ చూపిన ఒక  ప్రముఖ నాయకుడు. ఈ విచారకరమైన సమయంలో, ఆయన కుటుంబ సభ్యులకూ, మద్దతుదారులకు నా సంతాపం తెలియజేస్తున్నాను." అని పేర్కొన్నారు.

*****



(Release ID: 1673353) Visitor Counter : 171