ప్రధాన మంత్రి కార్యాలయం

కాబుల్ విశ్వ‌విద్యాల‌యం లో జ‌రిగిన ఉగ్రవాద ‌దాడిని తీవ్రంగా ఖండించిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 02 NOV 2020 11:01PM by PIB Hyderabad

కాబుల్ విశ్వవిద్యాల‌యం లో జ‌రిగిన ఉగ్ర‌వాద దాడిని పిరికిపంద‌లు చేసిన చ‌ర్య‌ గా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పేర్కొంటూ, ఆ చర్య ను తీవ్రం గా ఖండించారు.

‘‘పిరికిపంద ఉగ్రవాద శ‌క్తులు కాబుల్ విశ్వ‌విద్యాల‌యం లో ఈ రోజు న  చేసిన దాడి ని నేను తీవ్రం గా ఖండిస్తున్నాను.  బాధితుల, క్ష‌త‌గాత్రుల కుటుంబాల‌కు క‌లిగిన దు:ఖం లో మేము సైతం పాలుపంచుకొంటున్నాము.  ఉగ్ర‌వాదంతో  అఫ్గానిస్తాన్ చేస్తున్న సాహ‌సిక పోరాటానికి మద్దతివ్వడాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటాము’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

****
  



(Release ID: 1669670) Visitor Counter : 131