మంత్రిమండలి

ఆరోగ్యం, వైద్య శాస్త్రం రంగం లో భార‌త‌దేశానికి, కంబోడియా కు మ‌ధ్య అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 29 OCT 2020 3:40PM by PIB Hyderabad

ఆరోగ్యం, వైద్య శాస్త్రం రంగం లో భార‌త‌దేశానికి, కంబోడియా కు మ‌ధ్య అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పందం (ఎంఒయు) పై సంత‌కాల‌ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.  

ఆరోగ్య రంగం లో సంయుక్త కార్య‌క్ర‌మాలు, సాంకేతిక అభివృద్ధి మాధ్య‌మాల ద్వారా రెండు దేశాల మ‌ధ్య స‌హ‌కారాన్ని ఈ ద్వైపాక్షిక ఎంఒయు ప్రోత్స‌హిస్తుంది.  భార‌త‌దేశాని కి, కంబోడియా కు మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాల ను ఇది ప‌టిష్టం చేయ‌నుంది.  ఈ ఎంఒయు పై సంతకాలైన తేదీ నాటి నుంచి అమ‌లులోకి వ‌చ్చి,   అయిదు సంవ‌త్స‌రాల కాలానికి అమ‌ల‌వుతుంది.

రెండు ప్ర‌భుత్వాల మధ్య సహకారం చోటు చేసుకొనే ప్ర‌ధాన రంగాల లో..
 
•  త‌ల్లి, బిడ్డ‌ ల ఆరోగ్యం;

•  కుటుంబ సంక్షేమం;

•  హెచ్ఐవి/ఎఐడిఎస్, క్ష‌య వ్యాధి;

•  మందులు, ఔష‌ధ నిర్మాణ సంబంధ కృషి;

•  సాంకేతిక విజ్ఞానం బ‌ద‌లాయింపు;

•  సార్వ‌జ‌నిక ఆరోగ్యం, అంటువ్యాధులు;

•  వ్యాధి నియంత్రణ (సాంక్రామిక వ్యాధులు, అసాంక్రామిక వ్యాధులతో సహా);

•  భార‌త ప్ర‌భుత్వం లోని సంబంధిత మంత్రిత్వ శాఖ‌/ విభాగం, కంబోడియా లో నేశ‌న‌ల్ ఎథిక్ క‌మిటీ ఆమోదాలకు లోబడి వైద్య సంబంధి ప‌రిశోధ‌న‌- అభివృద్ధి;

•  వైద్య విద్య‌;

•  సార్వ‌జ‌నిక ఆరోగ్య రంగంలో స్వ‌స్థ‌త‌ కు సంబంధించిన మాన‌వ‌ వ‌న‌రుల వికాసం;

•  క్లినిక‌ల్‌, పారా- క్లినిక‌ల్, మేనేజ్‌మెంట్ సంబంధి నైపుణ్యాల లో శిక్ష‌ణ‌;

•  ఉభ‌య ప‌క్షాలు నిర్ణ‌యించిన ప్రకారం మ‌రేదైనా రంగంలో స‌హ‌కారం.. వంటివి భాగంగా ఉన్నాయి.
 


 

***



(Release ID: 1668443) Visitor Counter : 178