రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

వైమానిక దళ 88వ వార్షికోత్సవం సందర్భంగా వాయుసేన యోధులకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ శుభాకాంక్షలు

Posted On: 08 OCT 2020 12:48PM by PIB Hyderabad

వైమానిక దళ 88వ వార్షికోత్సవం సందర్భంగా; వాయుసేన యోధులకు, వారి కుటుంబాలకు రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌ శుభాకాంక్షలు తెలిపారు. 88 ఏళ్ల అంకితభావం, త్యాగం, సమర్థత ఐఏఎఫ్‌ను శత్రు భయంకరంగా, బలమైన శక్తిగా నిలబెట్టాయని తన సందేశంలో వెల్లడించారు.
    
    వాయుసేన సిబ్బందిని చూసి దేశం గర్విస్తోందని; సవాళ్లను ఎదుర్కొనడానికి, శత్రుమూకను తరిమికొట్టడానికి సిద్ధంగా ఉన్న వారి పరాక్రమానికి వందనం సమర్పిస్తోందని రాజ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఆధునీకరణ, స్వదేశీకరణ ద్వారా వాయుసేన పోరాట పటిమను పెంచడానికి కట్టుబడి ఉన్నామంటూ ట్వీట్‌ చేశారు.

    భారత గగనతలాన్ని వాయుసేన ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. "సురక్షిత గగనతలం, ప్రతిసారి సంతోషకర ల్యాండింగ్‌ ఉండాలని కోరుకుంటున్నా" అని తన ట్వీట్‌లో రాజ్‌నాథ్‌ ఆకాంక్షించారు.

****



(Release ID: 1662793) Visitor Counter : 111