ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ ప‌రీక్ష‌ల‌లో భార‌త‌దేశం కీల‌క మైలురాయిని దాటింది.

ఒక్క రోజులో రికార్డు స్థాయిలో కోవిడ్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌

గ‌త 24 గంట‌ల‌లో 10.5 ల‌క్ష‌ల కోవిడ్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌

అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచ‌న‌ల మేర‌కు రోజుకు ప్ర‌తి ప‌ది ల‌క్ష‌ల‌కు 140 ప‌రీక్ష‌లకు మించి నిర్వ‌హిస్తున్నాయి.

Posted On: 30 AUG 2020 11:56AM by PIB Hyderabad

కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా భార‌త దేశం కీల‌క మైల‌రాయిని దాటింది. తొలిసారిగా ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 10.5 ల‌క్ష‌ల కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది.
గ‌డ‌చిన 24 గంట‌ల‌లో దేశంలో 10,55,027  కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.దేశం జాతీయ కోవిడ్ ప‌రీక్ష‌ల సామ‌ర్ధ్యాన్ని రోజుకు 10 ల‌క్ష‌ల‌కు మించి చేసేందుకు ప‌రీక్ష‌ల వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసింది.
కోవిడ్ ప‌రీక్ష‌ల విష‌యంలో సాధించిన ఈ విజ‌యంతో  మొత్తం దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించిన కోవిడ్ ప‌రీక్ష‌ల సంఖ్య 4.14 కోట్లు (4,14,61,636) దాటింది.  కోవిడ్ -19 కి సంబంధించి అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకున‌ని , ప్ర‌భుత్వం, ప‌రీక్షించు, గుర్తించు, చికిత్స అందించు విధానాన్ని అనుస‌రిస్తోంది.రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స‌న్నిహిత స‌హ‌కారంతో దీనిని చేపడుతోంది. పెద్ద ఎత్తున కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తుండ‌డం వ‌ల్ల పాజిటివ్ కేసులు ప్రాథ‌మిక ద‌శ‌లోనే గుర్తించి సకాలంలో త‌గిన చికిత్స అందించ‌డానికి వీలు క‌లుగుతోంది. దీనితోపాటు స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న వారిని ఇంటి వ‌ద్ద ఐసొలేష‌న‌ల్‌లో ఉంచ‌డానికి,  తీవ్ర‌మైన కేసుల‌ను ఆస్ప‌త్రిలో ఉంచి చికిత్స అందించ‌డానికి వీలు క‌లుగుతోంది.
పెద్ద ఎత్తున కోవిడ్ ప‌రీక్ష‌ల సామ‌ర్ధ్యం పెర‌గ‌డం, ప‌రీక్ష‌ల సంఖ్య పెర‌గ‌డంతో ప్ర‌తి ప‌దిల‌క్ష‌ల‌కు నిర్వ‌హించే  ప‌రీక్ష‌ల సంఖ్య పెరిగింది. ప్ర‌స్తుతం ఇది ఈరోజు 30,044  వ‌ద్ద ఉంది.
ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ,   COVID-19  సందర్భంలో ప్రజారోగ్యం, సామాజిక కార్య‌క‌లాపాల‌ను సర్దుబాటు చేయడానికి ప్రజారోగ్య ప్రమాణాలు, పేరుతో విడుద‌ల చేసిన సూచ‌న ప‌త్రం కోవిడ్ అనుమానిత కేసుల‌పై స‌మ‌గ్ర నిఘా ఉంచాలని సూచించింది. ప‌దిల‌క్ష‌ల జ‌నాభాకు రోజుకు 140 ప‌రీక్ష‌లు చేయాల‌ని డ‌బ్ల్యు.హెచ్‌.ఓ సూచించింది. అయితే అన్ని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలూ ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సూచించిన స్థాయి ప‌రీక్ష‌ల సంఖ్య‌ను దాటేశాయి. ప‌లు రాష్ట్రాలు జాతీయ స‌గ‌టు కంటే త‌క్కువ పాజిటివిటీ రేటు క‌లిగి మంచి ప‌నితీరు క‌న‌బ‌రుస్తున్నాయి.

 

Description: Image
ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ వ్యూహం కూడా క్ర‌మంగా విస్త‌రింప చేయ‌డం జ‌రుగుతోంది. ఇందుకు నేష‌న‌ల్ ల్యాబ్ నెట్ వ‌ర్కును విస్త‌రిస్తున్నారు. ఈరోజుకు 1003 ప్ర‌భుత్వ ల్యాబ్‌లు, 580 ప్రైవేటు ల్యాబ్ ల‌లో కోవిడ్ ప‌రీక్ష‌లు  నిర్వ‌హిస్తున్నారు. దీనితో మొత్తం 1583 ల్య‌బా్‌ల‌లో స‌మ‌గ్ర కోవిడ్ ప‌రీక్షా స‌దుపాయాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నాయి. అవి:
- రియ‌ల్ టైమ్ ఆర్‌టి పిసిఆర్ ఆధారిత ప‌రీక్షా కేంద్రాలు  : 811 (ప్ర‌భుత్వం:463+ ప్రైవేటు 348)
-ట్రూనాట్ ఆధారిత ప‌రీక్షా కేంద్రాలు : 651 (ప్ర‌భుత్వం 506+ ప్రైవేటు 145)
-సిబినాట్ ఆధారిత ప‌రీక్షా కేంద్రాలు : 121 ( ప్ర‌భుత్వం 34+ ప్రైవేటు :87)

 

 కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత స‌మాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, ఇత‌ర సూచ‌న‌ల కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌మ‌నించండి : https://www.mohfw.gov.in/,@MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాల‌పై త‌మ ప్ర‌శ్న‌ల‌ను technicalquery.covid19[at]gov[dot]in  ఈమెయిల్‌కు పంపవ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను ncov2019[at]gov[dot]in కు అలాగే @CovidIndiaSeva కు పంప‌వ‌చ్చు
కోవిడ్ -19పై ఏవైనా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ హెల్ప్‌లైన్ నెంబ‌ర్ :  +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయ‌వ‌చ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .

***

 



(Release ID: 1649734) Visitor Counter : 183