రక్షణ మంత్రిత్వ శాఖ
జపాన్ రక్షణ శాఖ మంత్రితో ఫోన్ ద్వారా భారత రక్షణ శాఖ మంత్రి సంభాషణ
కొవిడ్-19 ఉపశమన చర్యలపై చర్చ
ద్వైపాక్షిక భద్రత సహకారాన్ని కొనసాగించేందుకు సంసిద్ధత
Posted On:
08 MAY 2020 5:58PM by PIB Hyderabad
కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్, జపాన్ రక్షణ శాఖ మంత్రి టారో కోనోతో ఫోన్ ద్వారా సంభాషించారు. కొవిడ్ మహమ్మారికి వ్యతిరేకంగా రెండు దేశాల్లో చేపట్టిన చర్యలు, ఫలితాలపై రక్షణ మంత్రులు ఇద్దరూ చర్చించారు. కరోనా వైరస్పై ప్రపంచం చేస్తున్న యుద్ధంలో భారత భాగస్వామ్యాన్ని శ్రీ రాజ్నాథ్ సింగ్, టారో కోనోకు వివరించారు. ఈ పోరాటంలో పరస్పరం సహకరించుకోదగిన అంశాలపైనా మాట్లాడుకున్నారు. కొవిడ్ సంక్షోభం ముగిసిన తర్వాత ఉత్పన్నమయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో, భారత్-జపాన్ అనుసరించే ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం రెండు దేశాలు కలిసి పనిచేయడానికి మంచి అడుగు అవుతుందని ఇరువురూ అంగీకరించారు. ఇదే అంశంలో, ఇతర దేశాలతో భాగస్వామ్యాల విషయంలోనూ ఇది మార్గంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యంలో భాగంగా, ద్వైపాక్షిక భద్రత సహకార కార్యక్రమాలను కొనసాగించేందుకు ఇరువురు రక్షణ మంత్రులు తమ నిబద్ధతను తెలియజేశారు.
(Release ID: 1622249)
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Odia
,
Tamil
,
Kannada