రైల్వే మంత్రిత్వ శాఖ

ప్ర‌యాణికుల రైలుస‌ర్వీసుల ర‌ద్దు పొడిగింపు

Posted On: 02 MAY 2020 12:45PM by PIB Hyderabad

కోవిడ్ -19  కు సంబంధించి తీసుకున్న చ‌ర్య‌ల కొన‌సాగింపుగా, భార‌తీయ రైల్వేకి చెందిన అన్ని ప్ర‌యాణికుల రైలు స‌ర్వీసుల  ర‌ద్దును 2020 మే 17 వ‌ర‌కు  పొడిగించారు.
అయితే వివిధ ప్రాంతాల‌లో చిక్కుకుపోయిన వ‌ల‌స‌కార్మికులు, యాత్రికులు, ప‌ర్యాట‌కులు, విద్యార్థులను శ్రామిక్ ప్ర‌త్యేక రైళ్ళ‌లో కేంద్ర హోం మంత్రిత్వ‌శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా ఆయా రాష్ట్రాల అవ‌స‌రాల‌కు అనుగుణంగా త‌ర‌లించ‌డం జ‌రుగుతుంది
 స‌ర‌కు ర‌వాణా, పార్శిల్ రైలు కార్య‌క‌లాపాలు ప్ర‌స్తుతం లాగే కొన‌సాగుతాయి.



(Release ID: 1620349) Visitor Counter : 150