ప్రధాన మంత్రి కార్యాలయం
2026 కామన్వెల్త్ క్రీడలు: మహిళల డిస్కస్ త్రో విభాగంలో కాంస్యం గెలిచిన సీమాకు ప్రధాని అభినందనలు
प्रविष्टि तिथि:
31 JUL 2026 2:33PM by PIB Hyderabad
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడలు-2026లో మహిళల డిస్కస్ త్రో విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న సీమాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
58.65 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని సీమా గెలుచుకున్నారని ప్రధానమంత్రి అన్నారు.
ఆమె సాధించిన విజయం భారతదేశానికి గర్వకారణమనీ, దేశ యువతకు స్ఫూర్తిదాయకమనీ శ్రీ మోదీ అన్నారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ మోదీ పోస్టు:
‘‘మహిళల డిస్కస్ త్రో విభాగంలో 58.65 మీటర్లు విసిరి కాంస్యం గెలుచుకున్న సీమాకు అభినందనలు. ఆమె కృషి భారత్కు గర్వకారణం. దేశ యువతకు స్ఫూర్తిదాయకం. ఆమె భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.’’
***
(रिलीज़ आईडी: 2292582)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati