ప్రధాన మంత్రి కార్యాలయం
స్కైరూట్ ఏరోస్పేస్కు చెందిన పవన్ చందన, నాగభరత్ డాకాతో ప్రధానమంత్రి భేటీ
प्रविष्टि तिथि:
27 JUL 2026 10:22PM by PIB Hyderabad
స్కైరూట్ ఏరోస్పేస్కు చెందిన పంవన్ చందన, నాగ భరత్ డాకాతో అద్భుతమైన చర్చ చేపట్టినట్లు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తెలిపారు.
అనేక ఇతర ఆసక్తికరమైన అంశాలతో పాటుగా విక్రమ్–1 విజయం గురించి చర్చించినట్లు ప్రధానమంత్రి తెలియజేశారు. ఇప్పటి వరకు సాగిన వారి ప్రయాణం, భవిష్యత్తు గురించి వారి ఆలోచనలను తెలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
వారి ఉత్సాహం, ఆశయం, సానుకూల దృక్పథం... మన ప్రైవేటు అంతరిక్ష రంగం స్ఫూర్తిని ప్రతిబింబిస్తున్నాయని శ్రీ మోదీ చెప్పారు. మొత్తం స్కైరూట్ బృందానికి అభినందనలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన పోస్టులో ప్రధానమంత్రి ఇలా అన్నారు:
‘‘స్కైరూట్ ఏరోస్పేస్కు చెందిన పవన్ చందన, నాగభరత్ డాకాతో అద్భుతమైన చర్చ జరిగింది.
మా చర్చలో విక్రమ్–1 విజయం గురించి సహజంగానే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. దీనితో పాటు అనేక ఆసక్తికరమైన అంశాల గురించి చర్చించాం. వారి ప్రయాణం గురించి, భవిష్యత్తు గురించి వారి ఆలోచనలను తెలుసుకోవడం ఆనందంగా ఉంది. వారి ఉత్సాహం, లక్ష్యం, సానుకూల దృక్పథం... ప్రైవేటు అంతరిక్ష రంగ స్ఫూర్తిని తెలియజేస్తోంది.
మొత్తం స్కైరూట్ బృందానికి శుభాకాంక్షలు’’
***
MJPS/SS/PRK
(रिलीज़ आईडी: 2290245)
आगंतुक पटल : 20