ప్రధాన మంత్రి కార్యాలయం
పహాడ్పూర్లో ఉన్న సంతాలీ జహేరా, హో జహేరాను పూజించిన రాష్ట్రపతి, ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
20 JUN 2026 8:51PM by PIB Hyderabad
పహాడ్పూర్ గ్రామంలో ఉన్న సంతాలీ జహేరా, హో జహేరాకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూజలు నిర్వహించారు.
గిరిజన వర్గాలు పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాలనూ, ప్రకృతితో వారికున్న అనుబంధాన్నీ ఈ పవిత్ర వనాలు ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.
ఇలాంటి ఆచారాలూ, సంప్రదాయాలూ సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని శ్రీ మోదీ తెలియజేశారు.
కాలానికి అతీతంగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాలను పరిరక్షించడంలోనూ, భవిష్యత్తు తరాలకు అందించడంలో తమ చిత్తశుద్ధిని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘పహాడ్పూర్ గ్రామంలోని సంతాలీ జహేరా, హో జహేరాను రాష్ట్రపతితో పాటు దర్శించుకున్నాను.
మన గిరిజన వర్గాలు పాటించే ఆధ్యాత్మిక సంప్రదాయాలనూ, ప్రకృతితో వారికున్న అనుబంధాన్నీ ప్రతిబింబించే ఈ పవిత్ర వనాలను పూజించాం. ఇలాంటి ఆచారాలు సుసంపన్నమైన భారతదేశ సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగం.
కాలానికి అతీతమైన ఈ సంప్రదాయాలను పరిరక్షించి, భవిష్యత్తు తరాలకు అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం.’’
****
(रिलीज़ आईडी: 2281451)
आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam