ప్రధాన మంత్రి కార్యాలయం
ద్వైపాక్షిక సంబంధాల్లో చారిత్రక విజయంగా ఇండియా- యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందాన్ని ప్రశంసించిన ప్రధాని
प्रविष्टि तिथि:
17 JUN 2026 10:03PM by PIB Hyderabad
2026 జులై 15 నుంచి ఇండియా-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తుండటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఒప్పందం ద్వైపాక్షిక వాణిజ్యాన్నీ, పెట్టుబడులనూ ప్రోత్సహిస్తుందని ప్రధానమంత్రి అన్నారు.
భారతీయ రైతులూ, శ్రామికులూ, ఎంఎస్ఎంఈలూ, అంకురసంస్థలూ, ఆవిష్కర్తలకు అనేక అవకాశాలను ఈ ఒప్పందం అందిస్తుందని శ్రీ మోదీ చెప్పారు. అలాగే వికసిత్ భారత్ - 2047 సాకారం కావడానికి అర్థవంతమైన సహకారం అందిస్తుందన్నారు.
ఏవియన్లో జరుగుతున్న జీ-7 సదస్సులో పాల్గొంటున్న తాను, యూకే ప్రధాని కీర్ స్టార్మర్ ఇద్దరూ భారత్-యూకే ఆర్థిక సంబంధాలకు అర్థవంతమైన వేగం తోడవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి ఇలా రాశారు:
‘‘భారత్- యూకే సంబంధాల్లో ఇదో చరిత్రాత్మక విజయం.
ఇండియా-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం 2026 జులై 15 నుంచి అమల్లోకి వస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
ఈ ఒప్పందం మన ద్వైపాక్షిక వాణిజ్యాన్నీ, పెట్టుబడులనూ గణనీయంగా పెంపొందిస్తుంది.
భారతీయ రైతులూ, శ్రామికులూ, ఎంఎస్ఎంఈలూ, అంకుర సంస్థలూ, ఆవిష్కర్తలకూ ఇది అనేక అవకాశాలను అందిస్తుంది. అలాగే వికసిత్ భారత్-2047 లక్ష్యం సాకారమయ్యేందుకు అర్థవంతమైన సహకారాన్ని అందిస్తుంది.
మన ఆర్థిక సంబంధాలకు కొత్త వేగం తోడవడం పట్ల జీ-7 సదస్సు కోసం ఏవియన్లో ఉన్న నేనూ, పీఎం స్టార్మర్ ఇద్దరూ సహజంగానే సంతోషిస్తున్నాం.’’
***
(रिलीज़ आईडी: 2274506)
आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam