ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమాసియాలో ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా - ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను స్వాగతించిన ప్రధాని
प्रविष्टि तिथि:
15 JUN 2026 1:21PM by PIB Hyderabad
పశ్చిమాసియాలో ఘర్షణను ముగించే విషయంలో అమెరికా - ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు.
ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయాలకు ఈ ఘర్షణ కారణమైందనీ, అనేక దేశాల్లో ప్రాణనష్టానికి దారితీసిందనీ ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఆ ప్రాంతంలో శాంతినీ, స్థిరత్వాన్నీ పునరుద్ధరించడంతోపాటు నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛను నెలకొల్పడంలోనూ ఈ అవగాహన దోహదపడుతుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
మిగిలిన అంశాలపైనా చర్చలు జరిగి.. ఒక సుస్థిరమైన తుది ఒప్పందం కూడా కుదురుతుందని భారత్ ఆశిస్తోందన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అవాంతరాలకూ, అనేక దేశాల్లో ప్రాణ నష్టానికీ కారణమైన పశ్చిమాసియా ఘర్షణకు ముగింపు పలికే విషయమై అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహనను స్వాగతిస్తున్నాను.
ఆ ప్రాంతంలో శాంతినీ, స్థిరత్వాన్నీ పునరుద్ధరించడంతోపాటు.. నౌకాయాన, వాణిజ్య స్వేచ్ఛను నెలకొల్పడంలోనూ ఈ అవగాహన ఎంతగానో దోహదపడుతుందని భారత్ ఆశిస్తోంది.
మిగిలిన అంశాలపైనా చర్చలు జరిగి.. ఒక సుస్థిరమైన తుది ఒప్పందం ఇరుదేశాల మధ్య కుదురుతుందని మేం భావిస్తున్నాం.”
***
(रिलीज़ आईडी: 2273009)
आगंतुक पटल : 21
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam