పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
ప్రపంచంలోనే అతి తక్కువ వంట గ్యాస్ ధరను చెల్లిస్తున్న భారతీయులు
పొరుగు దేశాల కంటే, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే భారత్లోనే చవకగా లభిస్తోన్న సిలిండరు
ఉజ్వల కుటుంబాలకు ప్రతి ఏటా మొదటి నాలుగు రీఫిల్ సిలిండర్లకు రూ. 300 చొప్పున రాయితీ – ఏటా లబ్ధిదారునికి రూ.1,200 ప్రయోజనం
పీఎంయూవై పరిధిలోకి రాని వారు కూడా మార్కెట్ కంటే రూ.700 తక్కువే చెల్లిస్తున్నారు
ఫిబ్రవరి నుంచి సౌదీ సీపీ 46 శాతానికి చేరుకోవడంతో ప్రతి సిలిండరుపై రూ.1,600కు పెరిగిన సరఫరా ధర – ప్రతి గృహ వినియోగ సిలిండరుపై వస్తున్న నష్టం రూ.700
హర్మూజ్ జలసంధి నుంచి ఇంధన కార్గోలను తరలిస్తున్న అతి తక్కువ దేశాల్లో భారత్ ఒకటి: పెట్రోలియం ఉత్పత్తులకు ఎలాంటి కొరత లేదు
प्रविष्टि तिथि:
07 JUN 2026 8:02AM by PIB Hyderabad
పొరుగు దేశాలతో పోలిస్తే.. భారతీయ కుటుంబాలు చవక ధరకే వంట గ్యాసును కొనుగోలు చేస్తున్నాయి. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో చెల్లించే ధర కంటే తక్కువే చెల్లిస్తున్నాయి. ప్రస్తుతం సరఫరా వ్యయం రూ.1,600కు పెరిగింది. అయినప్పటికీ ప్రధానమంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) లబ్ధిదారు 14.2 కేజీల సిలిండరుకు రూ. 642 చెల్లిస్తే, ఢిల్లీలోని సాధారణ వినియోగదారు రూ.942 చెల్లిస్తున్నారు.
|
మార్కెట్
|
14.2 కేజీల సిలిండరు ధర (₹)
|
ఉజ్వల వినియోగదారుడు ఎంత తక్కువ చెల్లిస్తున్నారంటే
|
|
ఇండియా (ఉజ్వల, సవరణ తర్వాత వర్తించేది)
|
642
|
—
|
|
పాకిస్థాన్
|
1,046
|
సుమారుగా 39%
|
|
నేపాల్
|
1,207
|
సుమారుగా 47%
|
|
బంగ్లాదేశ్
|
దాదాపు. 1,225
|
సుమారుగా 48%
|
|
శ్రీలంక
|
1,241
|
సుమారుగా 48%
|
|
అమెరికా
|
దాదాపు. 1,755
|
సుమారుగా 63%
|
|
ఆస్ట్రేలియా
|
దాదాపు. 1,765
|
సుమారుగా 64%
|
|
కెనడా
|
దాదాపు. 2,411
|
సుమారుగా 73%
|
.ప్రతి మార్కెట్లోని ధరతో పోలిస్తే ఉజ్వల సిలిండరుకు చెల్లిస్తున్న ధర రూ.642 ఎంత ప్రభావవంతమైనదో చివరి కాలమ్ సూచిస్తుంది.
మూలం: ప్రభుత్వ వర్గాలు, జాతీయ నియంత్రణ సంస్థలు
అంతర్జాతీయంగా ఉన్న ధరలపై ఆధారపడి భారతీయ పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ఉంటాయి. అయినప్పటికీ గృహ వినియోగ ఎల్పీజీకి సంబంధించి వినియోగదారుడు చెల్లించాల్సిన ధరను ప్రభుత్వం నియంత్రిస్తూనే ఉంటుంది. ఏ కుటుంబమైనా తనకు అవసరమైనన్ని సిలిండర్లను ఒక్కొక్కటీ రూ.942కే కొనుగోలు చేయవచ్చు. పీఎంయూవై లబ్ధిదారునికి ప్రతి ఏటా మొదటి నాలుగు రీఫిల్ సిలిండర్లకు రూ. 300 చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అదనపు ప్రయోజనం లభిస్తుంది. ఉజ్వల గృహానికి సంబంధించి సగటు వార్షిక వినియోగం నాలుగు రీఫిల్ సిలిండర్లు. వాస్తవానికి లబ్ధిదారులు ఈ సిలిండర్లకు రూ. 642 చెల్లిస్తారు. ఈ ప్రయోజనంలో ఎలాంటి మార్పూ లేదు. పీఎంయూవై పరిధిలోకి రాని వినియోగదారులు సైతం సిలిండరుకు మార్కెట్ ధర కంటే రూ.700 తక్కువే చెల్లిస్తున్నారు. పంపిణీ ఖర్చుల వల్ల వివిధ ప్రాంతాల్లో రీటైల్ ధరల్లో స్వల్ప వ్యత్యాసం ఉంటుంది.
సాధారణ వినియోగదారుల చెల్లించని అనేక వందల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. అంతర్జాతీయంగా ధరలు అమాంతం పెరిగిన సందర్భంలోనూ వినియోగదారుడిపై భారం పడకుండా ప్రభుత్వం తనపై వేసుకుంది.
వినియోగ నియంత్రణ
హోటళ్లు, వ్యాపార సంస్థలు ఉపయోగించే వాణిజ్య సిలిండరు ధర ప్రతినెలా మారుతుంది. ఎందుకంటే దాని ధర అంతర్జాతీయ ప్రామాణిక ధరపై ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది. గృహావసరాలకు వినియోగించే సిలిండర్ ధర అలా ఉండదు. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటోంది. ఈ దిగుమతుల ధర ప్రతి నెల ప్రారంభంలో సౌదీ ఆరామ్కో నిర్ణయించే సౌదీ కాంట్రాక్టు ధర (సీపీ)పై ఆధారపడి ఉంటుంది. ఇది బాహ్యధర. దీనిపై భారతీయ వినియోగదారుని ఎలాంటి నియంత్రణ ఉండదు.
పశ్చిమాసియా సంక్షోభ సమయంలో ప్రామాణిక ధర అమాంతం పెరిగింది. భారత్లో ఎల్పీజీ కోసం ఉపయోగించే 50:50 ప్రొపేన్-బ్యూటేన్ మిశ్రమం విషయానికి వస్తే.. సంక్షోభానికి ముందు ఫిబ్రవరిలో ఎల్పీజీకి సౌదీ సీపీ ధర టన్నుకు 543 అమెరికన్ డాలర్లుగా ఉండేది. ఫిబ్రవరి చివరిలో హర్మూజ్ జలసంధిని మూసివేసిన అనంతరం, సంక్షోభం కారణంగా మధ్య ప్రాచ్య గల్ఫ్ ఎగుమతులను తగ్గించిన తర్వాత, ఏప్రిల్ మొదటిసారి నిర్దేశించిన కాంట్రాక్టు ధర టన్నుకు 775 అమెరికన్ డాలర్లకు పెరిగింది. ప్రొపేన్ 750 అమెరికన్ డాలర్లు, బ్యూటేన్ 800 అమెరికన్ డాలర్లుగా ఉన్నాయి. ఆ తర్వాత జూన్లో ధర మరింత పెరిగి టన్ను 790 అమెరికన్ డాలర్లకు చేరుకుంది. సంక్షోభానికి ముందు ఫిబ్రవరి నాటి ధరలతో పోలిస్తే.. ప్రామాణిక ధర 46 శాతం పెరిగింది. మాలిక్యూల్ దిగుమతుల ధరలు సైతం పెరిగాయి.
|
కాలం, 2026
|
ప్రొపేన్ సీపీ (టన్నుకు అమెరికన్ డాలర్లు)
|
బ్యుటేన్ సీపీ (టన్నుకు అమెరికన్ డాలర్లు)
|
ఎల్పీజీకి సౌదీ సీపీ 50:50 మిశ్రమం (టన్నుకు అమెరికన్ డాలర్లు)
|
|
ఫిబ్రవరి (సంక్షోభానికి ముందు)
|
545
|
540
|
542.50
|
|
ఏప్రిల్ (హర్మూజ్ మూసివేత తర్వాత)
|
750
|
800
|
775.00
|
|
జూన్ (తాజాగా)
|
760
|
820
|
790.00
|
|
ఫిబ్రవరి నుంచి జూన్ కు పెరుగుదల
|
+215 (+39%)
|
+280 (+52%)
|
+247.50 (సుమారు +46%)
|
వినియోగదారునిపై పడని భారం
జూన్ కాంట్రాక్టు ధర అనంతరం దిగుమతి ఆధారిత ధరల ప్రకారం 14.2 కేజీల సిలిండరు వ్యయం రూ.1,600 దాటింది. ప్రస్తుతం ప్రతి గృహ వినియోగ సిలిండరుపై రూ.700 నష్టం వస్తోంది. ధరల పెరుగుదలలో తీవ్రత మార్కెట్ ధర ఆధారిత వాణిజ్య సిలిండరులో స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం సమయంలో అయిదు సార్లు ధరలు పెంచిన అనంతరం ఢిల్లీలోని హోటళ్లు, రెస్టారెంట్లకు అమ్మే 19 కేజీల సిలిండరు రూ. 3,113.50కు అమ్ముడవుతోంది. అంటే కేజీకి సుమారుగా రూ.164 అవుతోంది. సవరణ తర్వాత గృహ వినియోగ గ్యాసుపై వినియోగదారులు కేజీకీ రూ.66 చెల్లిస్తున్నారు. వాణిజ్య గ్యాసుపై అధిక పన్ను రేటు, పెద్ద మార్జిన్లు ఉంటాయి. కాబట్టి గృహ వినియోగ సిలిండర్ల కంటే ఎక్కువ ధర ఉంటుంది. అయినప్పటికీ గృహావసరాల కోసం వినియోగించే సిలిండరు వాస్తవ ధర రూ. 1,600 దాటుతోంది.
హర్మూజ్ మూసివేత అనంతరం కూడా కొనసాగుతున్న సరఫరా
సంక్షోభం ముదిరిన అనంతరం హర్మూజ్ జలసంధి గుండా వాణిజ్య రవాణా చాలా వరకు నిలిచిపోయింది. ప్రపంచంలో అయిదో వంతు చమురు, భారత ఇంధన దిగుమతుల్లో అధిక భాగం ఈ జలసంధి గుండానే వస్తోంది. భారత దేశ ఎల్పీజీ వినియోగంలో 54 శాతం ఈ జలసంధి ద్వారానే రవాణా అయ్యేది. ఈ అంతరాయం వల్ల ఎదురైన ప్రత్యక్ష ప్రభావం వంటగ్యాస్ సరఫరాపై పడింది. ఈ జలసంధి గుండా ఇంధనాన్ని తెచ్చుకుంటున్న అతి కొన్ని దేశాల్లో భారత్ ఒకటి. నిరంతర పర్యవేక్షణ ద్వారా భారతీయ జెండాలున్న ట్యాంకర్లు హర్మూజ్ గుండా ప్రయాణించి భారత్ పోర్టులకు చేరుకున్నాయి. ఇవి ముడి చమురు, ఎల్పీజీను తీసుకువచ్చాయి. పెట్రోలియం ఉత్పత్తులకు ఎలాంటి కొరత లేదు. బాటిలింగ్, పంపిణీ దేశవ్యాప్తంగా యధావిధిగా కొనసాగుతున్నాయి.
సంక్షోభ సమయంలో సరఫరాను కొనసాగించడానికి అనేక చర్యలు తీసుకున్నారు. సరఫరా విషయానికి వస్తే, దిగుమతుల లోటును తగ్గించడానికి దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని 32 టీఎంటీల నుంచి 52 టీఎంటీలకు అంటే 60 శాతానికి పైగా పెంచారు. నిరంతర సమన్వయం ద్వారా ఎల్పీజీతో నిండిన నౌకలు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించాయి. ఇతర దేశాల కంటే భారతీయ నౌకలే అత్యధిక సంఖ్యలో ప్రయాణించాయి. దీనికోసం ఎలాంటి పన్నూ చెల్లించలేదు. అదే సమయంలో జలసంధి ద్వారా ప్రయాణించాల్సిన అవసరం లేని అమెరికా, కెనడా, అల్జీరియా తదితర దేశాల నుంచి దిగుమతులను పెంచారు. అందుబాటులో ఉన్న ఎల్పీజీని ప్రాధాన్య వినియోగదారులైన గృహాలకు, ఆసుపత్రులకు, విద్యాసంస్థలకు అందించారు.
డిమాండు విషయానికి వస్తే, సిలిండర్ల పంపిణీ ఒత్తిడిని తగ్గించడానికి అందుబాటులో ఉన్న చోట పైప్డ్ నేచురల్ గ్యాసు (పీఎన్జీ)కి మారాల్సిందిగా వినియోగదారులను ప్రోత్సహించారు. దేశీయంగా సరఫరాను పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామిక సంఘాల సమన్వయంతో కఠినమైన మళ్లింపు నిరోధక చర్యలను అమలు చేశారు. రాయితీతో అందించే గృహ వినియోగ ఎల్పీజీని వాణిజ్య మార్కెట్లో దుర్వినియోగం చేయకుండా ఓటీపీ ఆధారిత డెలివరీ ధ్రువీకరణను సుమారుగా 90 శాతానికి పెంచారు.
ప్రభుత్వంపై పడుతున్న భారం
రెండు విభిన్న మార్గాల ద్వారా వినియోగదారునికి భద్రత లభిస్తుంది. అంటే రాయితీ, అండర్ - రికవరీ వేర్వేరు అంశాలుగా ఉంటాయి. అండర్ రికవరీ అంటే మాలిక్యూల్కి సంబంధించి అంతర్జాతీయ వ్యయానికి, నియంత్రిత రీటైల్ ధరకు ఉన్న వ్యత్యాసం. ఈ నష్టాన్ని ప్రభుత్వ రంగ మార్కెటింగ్ సంస్థలు భరిస్తాయి. ఈ లోటును ఖజానా నుంచి పాక్షికంగా భర్తీ చేస్తారు. గడచిన ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గృహ వినియోగ ఎల్పీజీపై మొత్తం నష్టం రూ. 60,000 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇది రూ. 41,338 కోట్లుగా ఉంది. దీనికి సంబంధించి రూ. 30,000 కోట్ల పరిహారాన్ని మార్కెటింగ్ సంస్థలకు అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. వినియోగదారులకు అదనంగా సబ్సిడీ లభిస్తుంది. ఉజ్వల వినియోగదారులకు ప్రతి సిలిండరుపై రూ.300 నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. దాదాపు 10.58 కోట్ల కనెక్షన్లకు ఈ ప్రయోజనం అందుతోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పద్ధతిలోనే భారతీయ వినియోగదారులందరూ అంతర్జాతీయ మార్కెట్ స్థాయిల కంటే చాలా తక్కువ ధరలకే ఎల్పీజీని పొందుతున్నారు. అంతర్జాతీయ ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం కొన్నేళ్లుగా తన పౌరులకు ప్రపంచంలోనే అతి తక్కువ ధరలకు వంట గ్యాస్ అందిస్తోంది.
.
|
కాలవ్యవధి
|
వ్యవస్థ (గృహావసర వినియోగ ఎల్పీజీ మాత్రమే)
|
మొత్తం
|
|
ఆర్థిక సంవత్సరం 2024–25
|
గృహ వినియోగ ఎల్పీజీపై మొత్తం నష్టం (అంతకు ముందు ఏడాది)
|
₹41,338 కోట్లు
|
|
ఆర్థిక సంవత్సరం 2025–26
|
గృహ వినియోగ ఎల్పీజీపై మొత్తం నష్టం (గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి)
|
₹60,000 కోట్లు
|
|
ఆర్థిక సంవత్సరం 2025–26
|
ఎల్పీజీ నష్టాలను పూడ్చుకొనేందుకు మార్కెటింగ్ సంస్థలకు పరిహారం అందించేందుకు క్యాబినెట్ ఆమోదించిన మొత్తం
|
₹30,000 కోట్లు
|
|
ఒక సిలిండరుకు
|
ప్రతి 14.2 కేజీల సిలిండరుపై భరిస్తున్న నష్టం
|
సుమారుగా ₹700
|
|
2016 నుంచి
|
పీఎంయూవై కనెక్షన్లు, ప్రత్యక్ష నగదు బదిలీ (సిలిండరకు రూ. 300)
|
10.58 కోట్ల కనెక్షన్లు
|
సంక్షిప్తంగా
హర్మూజ్ జలసంధి నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడటం వల్ల గల్ఫ్ దేశాల నుంచి వచ్చే సరఫరా తగ్గిపోయింది. దీనివల్ల 2026లో ఫిబ్రవరి, జూన్ మాసాల మధ్య ఎల్పీజీకి సంబంధించి సౌదీ సీపీ ప్రామాణిక ధర 46 శాతం మేర పెరిగింది. ఫలితంగా 14.2 కేజీల సిలిండర్ పంపిణీ ధర రూ. 1,600 దాటింది. సాధారణ వినియోగదారునికి రూ. 942కు, ఉజ్వల వినియోగదారునికి రూ. 642కు రీటైల్ ధరను సవరించారు. అంతర్జాతీయ ధరకు, నియంత్రిత పంపిణీ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసమే అండర్- రికవరీ. ఇది రాయితీకి భిన్నంగా ఉంటుంది. గృహ వినియోగ ఎల్పీజీకి సంబంధించి గతేడాది నష్టాలు రూ. 60,000 కోట్లకు చేరుకున్నాయని అంచనా. అంతకు ముందు సంవత్సరం అది రూ. 41,338 కోట్లుగా ఉంది. ఈ భారాన్ని ప్రభుత్వ రంగ మార్కెటింగ్ సంస్థలు, ఖజానా భరిస్తున్నాయి. దీనికి సంబంధించి రూ. 30,000 కోట్ల పరిహారాన్ని అందించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. దీనికి అదనంగా 10.58 కోట్ల మంది ఉజ్వల పథకం లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండరుకు రూ.300 చొప్పున అదనంగా జమవుతుంది. గత కొన్నేళ్లుగా భారతీయ వినియోగదారులంతా అంతర్జాతీయ మార్కెట్ ధరల కంటే తక్కువకే ఎల్పీజీని పొందుతున్నారు. పొరుగుదేశాలైన పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక కంటే భారతీయ గృహాలు తక్కువ ధరను చెల్లిస్తున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా కంటే కూడా తక్కువే చెల్లిస్తున్నాయి. సంక్షోభ సమయంలో హర్మూజ్ జలసంధి గుండా ఇంధన కార్గోలను రవాణా చేసిన అతి తక్కువ దేశాల్లో భారత్ ఉంది. దేశంలో ఏ పెట్రోలియం ఉత్పత్తికీ కొరత లేదు. అంతర్జాతీయ ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా తన పౌరులకు అతి తక్కువ ధరలకే వంట గ్యాసును భారత ప్రభుత్వం అందిస్తోంది.
ఉజ్వల పథకం పరిధిలో మొదటి నాలుగు సిలిండర్లు రూ.642కే లభిస్తాయి. అంటే వాస్తవ ధరల కంటే ఒక సిలిండరుకు వచ్చే రాయితీ సుమారుగా 60 శాతంగా ఉంటుంది. పీఎంయూవై పరిధిలోకి రాని వారికి అంతర్జాతీయ ధరలపై సుమారుగా 45 శాతం రాయితీతో రూ. 942కే సిలిండరు లభిస్తోంది.
ఈ విలువైన వనరును ఉపయోగించుకోవడంలో అత్యంత జాగ్రత్త వహించాలని, ఇంధనాన్ని ఆదా చేసే వంట పద్ధతులను అవలంబించాలని కోరుతున్నాం.
***
(रिलीज़ आईडी: 2270186)
आगंतुक पटल : 15