ప్రధాన మంత్రి కార్యాలయం
అండర్ 18 ఆసియా కప్ 2026లో కాంస్యం గెలిచిన భారత మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
06 JUN 2026 6:16PM by PIB Hyderabad
అండర్-18 ఆసియా కప్ 2026లో కాంస్య పతకం సాధించిన భారత మహిళల హాకీ జట్టుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అభినందనలు తెలియజేశారు. ఈ టోర్నమెంట్ పొడవునా భారత క్రీడాకారిణులు అసాధారణమైన పట్టుదలను, ప్రతిభను కనబరిచారని ప్రధానమంత్రి కొనియాడారు.
దేశంలో మహిళల హాకీకి పెరుగుతున్న బలాన్ని, మన క్రీడాకారిణుల్లో ఉన్న అపారమైన సామర్థ్యానికి ఈ ఘనతే నిదర్శనమని శ్రీ మోదీ తెలిపారు. ఈ సందర్భంగా భారత జట్టు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు..
‘‘అండర్-18 ఆసియా కప్ 2026లో కాంస్య పతకం గెలిచిన భారత మహిళల హాకీ జట్టుకు అభినందనలు. ఈ టోర్నమెంట్ అంతటా మన జట్టు అద్భుతమైన పట్టుదలను ప్రదర్శించింది. ఈ ఘనత భారతదేశంలో మహిళల హాకీ ఎదుగుతున్న బలాన్ని, మన క్రీడాకారిణుల అపారమైన ప్రతిభను ప్రతిబింబిస్తోంది. భవిష్యత్తులో వారు చేపట్టబోయే ప్రతి ప్రయత్నానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’.
****
(रिलीज़ आईडी: 2269913)
आगंतुक पटल : 10