ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్లోని అహ్మదాబాద్లో ప్రారంభం కానున్న తొలి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్షిప్
ప్రపంచవ్యాప్తంగా యోగాకున్న ప్రజాదరణ వివరించిన ప్రధాని
प्रविष्टि तिथि:
03 JUN 2026 10:31PM by PIB Hyderabad
ప్రపంచవ్యాప్తంగా యోగా అపారమైన ప్రజాదరణ పొందుతోందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పేర్కొన్నారు. రేపు అంటే జూన్ 4న గుజరాత్లోని అహ్మదాబాద్లో తొలి ప్రపంచ యోగాసన క్రీడా ఛాంపియన్షిప్ 2026 ప్రారంభం కానున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.
ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా ఔత్సాహికులను ఒకచోట చేరుస్తోందని, యోగాసనానికి సంబంధించిన ప్రపంచ క్రీడా ప్రణాళికలో ఇది ముఖ్యమైన విజయమని ప్రధానమంత్రి తెలియజేశారు. రేపు సాయంత్రం సుమారు 6:40 గంటలకు వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొంటానని శ్రీ మోదీ ప్రకటించారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి అభినందనలు తెలియజేశారు. ఈ పోటీల్లో పాల్గొనే వారందరికీ తన శుభాకాంక్షలు తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి పోస్టు:
‘‘ప్రపంచవ్యాప్తంగా యోగాకు అత్యంత ప్రజాదరణ లభిస్తోంది! రేపు, జూన్ 4న అహ్మదాబాద్లో చాలా ప్రత్యేకమైన పోటీ జరగనుంది. అదే ప్రపంచ యోగాసన క్రీడల ఛాంపియన్షిప్ - 2026. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా ఔత్సాహికులను ఈ వేదిక ఒక్కచోటకు చేరుస్తోంది. యోగాసనాలకు సంబంధించి అంతర్జాతీయ క్రీడా ప్రణాళికలో ఇది ఓ ముఖ్యమైన విజయం. రేపు సాయంత్రం 6:40 ప్రాంతంలో వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ వినూత్న కార్యక్రమ నిర్వాహకులకు అభినందనలు.’’
***
(रिलीज़ आईडी: 2268882)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam