పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పెట్రోల్, డీజిల్ విషయంలో దేశీయ డిమాండ్‌ను పూర్తిగా తీరుస్తున్న భారతదేశపు చమురు శుద్ధి సామర్థ్యం


రిటైల్ ఇంధన విక్రయకేంద్రాల వినియోగంలో క్రమశిక్షణ పాటించాలని పిలుపునిచ్చిన ప్రభుత్వం

రిటైల్ వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు నష్టాలను భరిస్తోన్న ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు

రిటైల్ ఇంధన సరఫరాల మళ్లింపు, అనధికారిక నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించిన ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 27 MAY 2026 8:14PM by PIB Hyderabad

రిటైల్పారిశ్రామిక అవసరాలతో సహా దేశీయ అవసరాన్నింటినీ తీర్చడానికి దేశంలో పెట్రోల్డీజిల్ సరఫరా అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిందిభారత్‌ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు శుద్ధి దేశంకార్యకలాపాలు నిర్వహిస్తున్న 22 చమురు శుద్ధి కేంద్రాలతో సంవత్సరానికి 258.1 మిలియన్ టన్నుల స్థాపిత శుద్ధి సామర్థ్యాన్ని దేశం కలిగి ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశీయ వినియోగం 243.2 మిలియన్ టన్నులుగా ఉందిఅదే సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు 61.5 మిలియన్ టన్నులుగా నమోదయ్యాయిదీనితో ప్రపంచవ్యాప్తంగా శుద్ధి చేసిన పెట్రో ఉత్పత్తుల విషయంలో అతిపెద్ద ఎగుమతిదారులలో భారత్ ఒకటిగా నిలిచిందివీటికి సంబంధించి ఏ రకమైన సరఫరా సమస్యలూ లేవు.

అందరికీ పెట్రోల్డీజిల్ నిరంతరాయంగా సరఫరా అయ్యేలా చూడటం కోసం కేంద్ర పెట్రోలియంసహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురీ.. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలురాష్ట్ర ప్రభుత్వాలుపరిశ్రమల విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారుప్రభుత్వం ఈ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందిపెట్రోలియంసహజ వాయువు శాఖ (పీ-ఎన్‌జీకార్యదర్శి ఈ రోజు రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులుఫిక్కీసీఐఐ ప్రతినిధులతో కలిసి పరిస్థితిని సమీక్షించారుక్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం అన్ని ప్రాంతాల్లో ఒకేలా ఉందిదేశంలో ఎలాంటి పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదుఅయితే కొన్ని ప్రాంతాల్లో ధరల వ్యత్యాసాన్ని లాభంగా మార్చుకునే (ఆర్బిట్రేజ్ధోరణి నడుస్తుండటంతో కొరత ఉందన్న వాతావరణం కనిపిస్తోంది.

ఈ విషయంలో పనితీరు చాలా స్పష్టంగా ఉందిపశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వినియోగదారుల ప్రయోజనాలు కాపాడేందుకు చమురు మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ ధరల పూర్తి భారాన్ని దేశీయ రిటైల్ అమ్మకాలకు బదిలీ చేయటం లేదుప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం పెట్రోల్డీజిల్గృహావసరాల ఎల్‌పీజీ విక్రయాలపై రోజుకు దాదాపు రూ. 550 కోట్ల నష్టాలను భరిస్తున్నాయిఈ వెసులుబాటు కేవలం రిటైల్ వినియోగదారులు.. అంటే గృహాలుద్విచక్ర వాహనదారులుపంపుల వద్ద ఇంధనం కొనుగోలు చేసే రైతులకు మాత్రమే అందుబాటులో ఉందిఇది పారిశ్రామిక కొనుగోళ్లకు వర్తించదుఅక్కడ ఎప్పటిలానే ధరలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగానే మారుతుంటాయి.

తమ కొనుగోళ్లను పారిశ్రామిక మార్గం‌లో కాకుండా రిటైల్ పంపుల నుంచి చేస్తుండటం వల్ల సామాన్య ప్రజలకు దక్కాల్సిన సబ్సిడీ ప్రయోజనాన్ని పారిశ్రామిక వినియోగదారులు పొందుతున్నారుదీనివల్ల వారు ఒకే చోట డిమాండ్‌‌ను విపరీతంగా పెంచేస్తున్నారుతద్వారా అసలు ఎలాంటి కొరత లేని ప్రాంతాల్లో సైతం స్థానికంగా కృత్రిమ కొరత ఏర్పడేలా చేస్తున్నారు.

అధిక ధరల కారణంగా ప్రస్తుత నెలలో రిటైల్ విక్రయకేంద్రాలుబల్క్ వినియోగదారులు రెండు విభాగాల్లోనూ హెచ్ఎస్‌డీ అమ్మకాలు సుమారు 38 శాతం తగ్గినట్లు ప్రైవేట్ చమురు మార్కెటింగ్ కంపెనీలు నివేదిస్తున్నాయిఈ అమ్మకాల పరిమాణం పూర్తిగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ రిటైల్ విక్రయకేంద్రాలకు మళ్లుతోందిదీనికి తోడు పీఎస్‌యూలకు సంబంధించిన బల్క్ వినియోగదారుల అమ్మకాల పరిమాణంలో కూడా దాదాపు 29 శాతం తగ్గుదల నమోదైందిఈ డిమాండ్‌ కూడా రిటైల్ విక్రయకేంద్రాలకే మళ్లుతోంది

పైన పేర్కొన్న అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించిందిఈ విషయంలో నిబంధనలతో పాటు వాటి ఉల్లంఘనల వల్ల కలిగే పరిణామాలను తమ సభ్యులకు తెలియజేసి అవగాహన కల్పించాలని పరిశ్రమల సంఘాలను కోరింది.

నిత్యావసరాల చట్టందాని కింద జారీ అయిన నియంత్రణ ఉత్తర్వుల్లోని సంబంధిత నిబంధనల ప్రకారం రిటైల్ వినియోగదారుల కోసం ఉద్దేశించిన సరఫరాను పొందుతున్న బల్క్ వినియోగదారులుఅక్రమ నిల్వలు చేసేవాళ్లునల్లబజారు క్రయవిక్రయాలుఅనధికారిక నిల్వలుపెట్రోలియం ఉత్పత్తుల మళ్లింపులపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.

ప్రభుత్వం అంతర్జాతీయ పరిస్థితిని నిశితంగా గమనిస్తోందిఈ సంక్షోభ సమయంలో భారతదేశపు చమురు శుద్ధి సామర్థ్యంప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీల క్రమశిక్షణతో కూడిన పనితీరు.. కేంద్రంరాష్ట్రాలుపరిశ్రమల మధ్య చురుకైన సమన్వయం ఇంధన భద్రతను కాపాడటంలో ఒక బలమైన రక్షణ వ్యవస్థగా పనిచేస్తున్నాయిప్రజలు కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని.. కేవలం ధరల వ్యత్యాస సమస్యను సరఫరా సమస్యగా పొరబడుతూ వచ్చే వదంతులను పట్టించుకోవద్దని ప్రభుత్వం కోరుతోంది

***


(రిలీజ్ ఐడి: 2266304) సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam