ప్రధాన మంత్రి కార్యాలయం
వికసిత్ సిక్కిం 2047 దిశగా ఆ రాష్ట్ర ఘనమైన వారసత్వం, ప్రగతిని తెలియజేసే ఒక కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 MAY 2026 11:31AM by PIB Hyderabad
సిక్కిం 51వ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా రాసిన ఒక కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
సిక్కిం నేల, జ్ఞాపకాలు, చైతన్యానికి కాంచన్జంగా రక్షణగా ఉందన్న ప్రధాని.. ఈ కథనం దాని ప్రాధాన్యతను తెలియజేస్తోందని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు:
“సిక్కిం రాష్ట్రానికి 51 సంవత్సరాలు నిండిన సందర్భంగా కాంచన్జంగా గురించి కేంద్ర మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య ఎం. సింధియా ఒక వ్యాసం రాశారు. అది సిక్కిం నేల, జ్ఞాపకాలు, చైతన్యానికి రక్షకుడిగా ఉందని ఆయన కొనియాడారు.
కాంచన్జంగా పంచ నిధులు ఈ రాష్ట్ర ప్రగతి ప్రయాణాన్ని నిరంతరం నడిపిస్తూ 'వికసిత్ సిక్కిం 2047' సాధనకు మార్గం సుగమం చేస్తున్నాయని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు."
***
(రిలీజ్ ఐడి: 2264738)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10