సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
కేంద్ర సెన్సార్ బోర్డు (సీబీఎఫ్సీ) ఛైర్మన్గా శ్రీ శశిశేఖర్ వెంపటి నియామకం
నాడు పోస్టు చేయడమైనది:
06 MAY 2026 3:16PM by PIB Hyderabad
మే 6, 2026న భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఛైర్పర్సన్గా శ్రీ శశి శేఖర్ వెంపటి నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ప్రసార భారతి ఛైర్మన్గా శ్రీ ప్రసూన్ జోషి పదోన్నతి పొందటంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఛైర్పర్సన్ పదవి నుంచి వైదొలిగారు. దీంతో ప్రస్తుత నియామకం జరిగింది.
మీడియా, ప్రసార రంగం, పబ్లిక్ కమ్యూనికేషన్ రంగాల్లో శ్రీ శశిశేఖర్ వెంపటికి అపారమైన అనుభవం ఉంది. ఆయన నియామకంతో సీబీఎఫ్సీ పనితీరు మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.
***
(రిలీజ్ ఐడి: 2258437)
సందర్శకుల సూచీ సంఖ్య : : 11
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali-TR
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam