ప్రధాన మంత్రి కార్యాలయం
రాయ్పూర్లో డీజీపీ/ఐజీపీ సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
29 NOV 2025 8:24PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు రాయ్పూర్లో జరిగిన డైరెక్టర్ జనరళ్లు, ఇన్స్పెక్టర్ జనరళ్ల (డీజీపీ/ఐజీపీ) సదస్సు మొదటి రోజు సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ భద్రతా వ్యవస్థలోని వివిధ అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. జాతీయ భద్రతా రంగంలో ఉత్తమ పద్ధతులను, ఆవిష్కరణలను పంచుకోవడానికి ఈ సదస్సు ఒక కీలకమైన వేదికగా పనిచేస్తుందని ప్రధాన మంత్రి తెలిపారు.
"రాయ్పూర్లో జరిగిన డీజీపీ/ఐజీపీ సదస్సు మొదటి రోజు, భారతదేశ భద్రతా వ్యవస్థలోని వివిధ అంశాలపై విస్తృత చర్చలకు వేదికైంది. ఈ రంగంలోని ఉత్తమ పద్ధతులను, ఆవిష్కరణలను పంచుకోవడానికి ఇది ఒక అద్భుతమైన వేదిక" అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2254494)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam