మంత్రిమండలి
azadi ka amrit mahotsav

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుడుపై తీర్మానాన్ని ఆమోదించిన కేబినెట్

నాడు పోస్టు చేయడమైనది: 12 NOV 2025 8:17PM by PIB Hyderabad

ఈ నెల 10వ తేదీ సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఉగ్రవాద ఘటనలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ తీవ్ర విచారం వ్యక్తం చేసిందిఈ దుర్ఘఘటనలో ప్రాణాలు కోల్పోయిన పౌరులకు నివాళులర్పిస్తూ కేబినెట్ రెండు నిమిషాలు మౌనం పాటించింది.

మంత్రివర్గం ఈ తీర్మానాన్ని కూడా ఆమోదించింది:

ఈ నెల 10న సాయంత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ద్వారా దేశ వ్యతిరేక శక్తుల దారుణమైన ఉగ్రవాద ఘటనను దేశమంతా చూసిందిఈ పేలుడు ఫలితంగా అనేక మంది మరణించారు... చాలా మంది గాయపడ్డారు.

అర్థరహితమైన ఈ హింస బారిన పడిన బాధితులకు కేబినెట్ నివాళులర్పిస్తోందిమృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తోంది.

గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని కేబినెట్ ప్రార్థిస్తుందిబాధితులకు సంరక్షణనుమద్దతునందిస్తున్న వైద్య సిబ్బందిఅత్యవసర సేవల సిబ్బంది సత్వర ప్రయత్నాలనూ కేబినెట్ అభినందిస్తోంది.

అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఈ దుర్మార్గమైనపిరికిపంద చర్యను కేబినెట్ ఖండిస్తోంది.

ఉగ్రవాదపు అన్ని రూపాలువ్యక్తీకరణలను ఏమాత్రం సహించని విధానం పట్ల భారత్ అచంచలమైన నిబద్ధతను కేబినెట్ పునరుద్ఘాటిస్తోంది.

భారత్‌కు తమ సంఘీభావంమద్దతును ప్రకటిస్తున్న ప్రపంచ దేశాలకు కేబినెట్ ధన్యవాదాలు తెలుపుతోంది.

ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ ధైర్యంగాదయతో వ్యవహరించిన అధికారులుభద్రతా సంస్థలుపౌరులు సకాలంలోసమన్వయంతో స్పందించిన తీరును కేబినెట్ ప్రశంసిస్తోందివారి అంకితభావంవిధి నిర్వహణలో వారి నిబద్ధత ఎంతో ప్రశంసనీయం.

ఈ ఘటనపై దర్యాప్తును అత్యవసరంగా, వృత్తిపరమైన నిబద్ధతతో కొనసాగించాలని... తద్వారా నేరస్థులువారికి సహకరించినవారువారిని పెంచిపోషిస్తున్న వారిని గుర్తించి న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలని కేబినెట్ ఆదేశించిందిప్రభుత్వం అత్యున్నత స్థాయిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉంది.

దేశ భద్రతప్రతి పౌరుడి భద్రత పట్ల ప్రభుత్వ నిరంతర నిబద్ధతకు అనుగుణంగా... భారతీయులందరి ప్రాణాలనుశ్రేయస్సును పరిరక్షించడం పట్ల ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని కేబినెట్ పునరుద్ఘాటిస్తోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2254311) సందర్శకుల సూచీ సంఖ్య : : 16