ప్రధాన మంత్రి కార్యాలయం
కర్నాటక మాండ్యలో శ్రీ గురు భైరవైక్య మందిర ప్రారంభోత్సవ ప్రసంగ విశేషాలను ప్రజలతో పంచుకున్న ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
15 APR 2026 5:42PM by PIB Hyderabad
కర్నాటక రాష్ట్రం మాండ్యలో శ్రీ గురుభైరవైక్య మందిర ప్రారంభోత్సవం సందర్భంగా.. తన ప్రసంగంలోని ముఖ్య విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో చేసిన వరుస పోస్టుల్లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“వైభవోపేతమైన మన ఆధ్యాత్మిక సంప్రదాయాలకు శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం సజీవ ప్రతీకగా నిలుస్తోంది. సామాజిక సేవలో మఠం కృషి అత్యంత స్ఫూర్తిదాయకం.”
“మన సమాజంలో ఎప్పటికప్పుడు గొప్ప ఆధ్యాత్మిక సాధకులు ఉదయించి, మార్గనిర్దేశం చేశారు.”
“తొమ్మిది మార్గదర్శక సూత్రాలు ప్రాతిపదికగా శ్రీ ఆదిచుంచనగిరి మహాసంస్థాన మఠం సేవలందిస్తుంది. అదే స్ఫూర్తితో ప్రతిఒక్కరూ ఈ తొమ్మిది అంశాలపట్లా సమష్టిగా కంకణబద్ధులు కావాలని కోరుతున్నాను.’’
***
(రిలీజ్ ఐడి: 2252384)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam