భారత ఎన్నికల సంఘం
azadi ka amrit mahotsav

శాసనసభలకు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు-2026 అస్సాం, పుదుచ్చేరిల్లో అత్యధికంగా పోలింగ్ నమోదు

నాడు పోస్టు చేయడమైనది: 09 APR 2026 8:58PM by PIB Hyderabad
  1. 1. అస్సాంకేరళపుదుచ్చేరి శాసనసభల సాధారణ ఎన్నికలకు, 3 రాష్ట్రాల్లోని అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు ఇవాళ ఉదయం గంటలకు పోలింగ్ ప్రారంభమైందిఅక్కడక్కడా చిన్నచిన్న సంఘటనలు మినహా అంతటా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

    2. అస్సాంలో 85.38 శాతంపుదుచ్చేరిలో 89.83 శాతం ఓటింగ్ నమోదైందిఇప్పటివరకు అక్కడ జరిగిన ఎన్నికల్లో ఇది అత్యధిక ఓటింగ్ శాతంగతంలో అస్సాంలో అత్యధికంగా 84.67 శాతం (2016 అసెంబ్లీ ఎన్నికలు), పుదుచ్చేరి 86.19 శాతం (2011 అసెంబ్లీ ఎన్నికలుపోలింగ్‌ నమోదైంది.

    3. పోలింగ్ వివరాలు (శాతాల్లోఈ విధంగా ఉన్నాయి:


 


 

రాష్ట్రంయూటీ

పోలింగ్ శాతం (%)

పురుషులు

మహిళలు

3వ వర్గం

మొత్తం

శాసనసభల సాధారణ ఎన్నికలు

అస్సాం

84.80

85.96

36.84

85.38

కేరళ

75.01

80.86

57.04

78.03

పుదుచ్చేరి

88.09

91.33

91.81

89.83

అసెంబ్లీ నియోజక వర్గాల ఉప ఎన్నికలు

కర్ణాటక

1.  బాగల్‌కోట్-24

68.69

68.68

0.07

68.70

2.  దావణగెరె సౌత్-107

68.55

68.55

0.08

68.55

నాగాలాండ్

1.  కోరిడాంగ్-28

79.34

85.14

-

82.21

త్రిపుర

1.  ధర్మనగర్-56

79.80

80.26

-

80.04


 

  • ఈసీఐనెట్ పోర్టల్‌లో పీఆర్ఓలు అందించిన చేసిన డేటా ప్రకారం.. ఇంకా 3,469 పీఎస్‌ల సమాచారం అప్‌డేట్ కావాల్సి ఉంది.

  • ఇవి ప్రాథమిక గణాంకాలుఇందులో సర్వీసు ఓటర్లుపోస్టల్ బ్యాలెట్ల వివరాలను చేర్చలేదుతుది గణాంకాలను ఇండెక్స్ కార్డు ద్వారా ఈసీఐ వెల్లడిస్తుంది.

4. ఎన్నికల కమిషనర్లు డాక్టర్ ఎస్.ఎస్సంధుడాక్టర్ వివేక్ జోషిలతో కలిసి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీశ్రీ జ్ఞానేష్ కుమార్.. లైవ్ వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారుఅస్సాంకేరళపుదుచ్చేరి రాష్ట్రాల్లోని 100 శాతం పోలింగ్ కేంద్రాల్లో తొలిసారిగా వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశారు.

5. అస్సాంకేరళయూటీ అయిన పుదుచ్చేరిలోని 296 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇవాళ జరిగిన ఎన్నికల్లో సుమారు 5.31 కోట్లకు పైగా ఓటర్లుఓటు హక్కును వినియోగించుకున్నారువీటితో పాటు రాష్ట్రాల్లోని (కర్ణాటకనాగాలాండ్త్రిపుర) 4 ఏసీలకు ఉపఎన్నికలు నిర్వహించారు.

6. ఇంటర్నేషనల్ ఎలక్షన్ విజిటర్స్ ప్రోగ్రామ్ (ఐఈవీపీ)లో భాగంగా 22 దేశాలకు చెందిన 38 మంది ప్రతినిధులు ఎన్నికల నిర్వహణను ప్రత్యక్షంగా వీక్షించారు.

7. నిన్న రాత్రి 2.5 లక్షల మందికిపైగా పోలింగ్ సిబ్బందివారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారుఎన్నికల్లో పోటీ చేసిన 1,899 మంది అభ్యర్థులు నియమించిన 1.8 లక్షల మందికి పైగా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో ఇవాళ ఉదయం గంటల్లోపే మాక్ పోలింగ్ పూర్తయిందిఅనంతరం 63,084 పోలింగ్ కేంద్రాల్లో ఓకే సమయంలో పోలింగ్ ప్రారంభమైంది.

8. ఈసీఐ తాజా ఆదేశాల ప్రకారం.. పోలింగ్ ముగిసిన వెంటనేపోలింగ్ కేంద్రాల నుంచి ప్రిసైడింగ్ అధికారులు బయలుదేరక ముందుగానే ఓటింగ్ గణాంకాలను అప్‌డేట్ చేశారుఫలితంగా ఓటింగ్ వివరాలను సుమారుగా వెల్లడించటంలో ఆలస్యం జరగలేదు.

9. ఓటర్లకు అనుకూలంగా ఉండే ఎన్నో నూతన కార్యక్రమాలను ఈ ఎన్నికల్లో అమలు చేశారుఈవీఎం బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల స్పష్టమైన కలర్ ఫోటోలుమొబైల్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎండీఎఫ్), సులభంగా చదవగలిగేలా కొత్తగా రూపొందించిన ఓటరు సమాచార స్లిప్పులు (వీఐఎస్), ప్రతి పోలింగ్ కేంద్రానికి ఓటర్ల సంఖ్యను గరిష్ఠంగా 1,200కు పరిమితం చేయటం వంటి చర్యలు తీసుకున్నారు.

10. దివ్యాంగ ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో వీల్‌ఛైర్లువాలంటీర్లను కేటాయించారుపీడబ్ల్యూడీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకునేందుకు రవాణా సౌకర్యాన్ని కల్పించారు.

11. జిల్లాల వారీగాఅసెంబ్లీ నియోజవర్గాల వారీగా సుమారు ఓటింగ్ శాతం వివరాలు ఈసీఐనెట్ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2250736) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Gujarati , Tamil