ప్రధాన మంత్రి కార్యాలయం
గుడ్ఫ్రైడే సందర్భంగా సామరస్యం, కరుణ ప్రాముఖ్యత చెప్పిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
03 APR 2026 9:38AM by PIB Hyderabad
జీసస్ క్రీస్తు త్యాగాన్ని గుడ్ఫ్రైడే గుర్తు చేస్తుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
సామరస్యం, కరుణ, క్షమాగుణం వంటి విలువలను ఈ రోజు తెలియజేస్తుందని స్పష్టం చేశారు.
సోదరభావం, నమ్మకం ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలవాలని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
"ఏసుక్రీస్తు త్యాగాన్ని గుడ్ఫ్రైడే గుర్తు చేస్తుంది. సామరస్యం, కరుణ, క్షమాగుణం వంటి విలువలను ఈ రోజు మరింత బలోపేతం చేయాలి. సోదరభావం, నమ్మకం మనందరికీ మార్గదర్శకంగా నిలవాలని ఆశిస్తున్నా"
(రిలీజ్ ఐడి: 2248751)
సందర్శకుల సూచీ సంఖ్య : : 16