ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

ఉత్తర ప్రదేశ్‌లో బారాబంకి-బహ్రాయిచ్ మధ్య (101.515 కి.మీ.) నాలుగు వరుసల జాతీయ రహదారి-927 నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదం


· రూ.6969.04 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో రూపుదిద్దుకోనున్న వినియోగ నియంత్రిత రహదారి

నాడు పోస్టు చేయడమైనది: 18 MAR 2026 4:10PM by PIB Hyderabad

ఉత్తరప్రదేశ్‌లో బారాబంకి-బహ్రాయిచ్ మధ్య (101.515 కి.మీ.) 4 వరుసల వినియోగ నియంత్రిత  జాతీయ రహదారి-927 నిర్మాణానికి ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి ఆర్థిక వ్యవహారాల కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపింది. మొత్తం రూ.6969.04 కోట్ల వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ విధానం కింద ఈ రహదారి పనులను చేపడతారు.

ఇది రాష్ట్రంలోని జాతీయ రహదారి-927’ పరిధిలోని బారాబంకి-బహ్రాయిచ్ విభాగం ఉన్నతీకరణకు ఉద్దేశించిన ప్రాజెక్టు. ఈ రెండు జిల్లాల్లోని వివిధ జనసమ్మర్ద ప్రాంతాల్లో ప్రస్తుతం ఎదురవుతున్న తీవ్ర కోణీయ లోపాలు, పదునైన మలుపులు, రద్దీ వంటి సమస్యలన్నీ ఈ మార్గం నిర్మాణంతో పరిష్కృతం అవుతాయి. అడుగడుగునా సర్వీస్ రోడ్లతో కూడిన ఈ వినియోగ నియంత్రిత 4 వరుసల రహదారి ప్రధాన నివాస ప్రాంతాల మీదుగా వెళ్తూనే, సగటు ప్రయాణ వేగాన్ని పెంచగలదు. అంతేకాకుండా ప్రయాణ సమయాన్ని దాదాపు గంట వరకూ తగ్గిస్తూ- మొత్తం రహదారి భద్రత, ఇంధన సామర్థ్యం, వాహన నిర్వహణ వ్యయాన్ని మెరుగుపరుస్తుంది. తద్వారా ప్రాంతీయ రవాణా సహా సామాజిక-ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది.

రహదారి విభాగం ఉన్నతీకరణతో ఉత్తరప్రదేశ్‌లోని కీలక ఆర్థిక, సామాజిక, రవాణా కేంద్రాలకు నిరంతర అనుసంధానం కలుగుతుంది. అంతేకాకుండా 3 ఆర్థిక, 2 సామాజిక, 12 రవాణా కేంద్రాలను జోడించడం ద్వారా బహుళ రవాణా అనుసంధానాన్ని ఈ నవీకృత కారిడార్ మెరుగుపరుస్తుంది. ఇది రూపైదిహా భూమార్గ ఓడరేవు, విమానాశ్రయాలతో మెరుగైన బహుళ రవాణా సౌకర్యాన్ని కల్పిస్తూ, ఈ ప్రాంతమంతటా వస్తు, ప్రయాణిక సత్వర రవాణా సౌలభ్యం కల్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తితో నేపాల్‌గంజ్ సరిహద్దు ద్వారా భారత్‌-నేపాల్ మధ్య కీలకమైన సరిహద్దు వాణిజ్య-రవాణా వ్యూహాత్మక కారిడార్‌ ఏర్పాటవుతుంది. రూపైదిహా భూమార్గ ఓడరేవుకు సౌలభ్యాన్ని గణనీయంగా  మెరుగుపరుస్తుంది. బహ్రాయిచ్, శ్రావస్తి వంటి మారుమూల జిల్లాలకు అనుసంధానం కూడా దీనితో మెరుగవుతుంది. ఈ ప్రాజెక్టుతో పీఎం గతిశక్తి కార్యక్రమంతోపాటు ఆర్థిక, రవాణా కేంద్రాలకు మద్దతు లభిస్తుంది. వ్యవసాయ వాణిజ్యం, పర్యాటకం, సరిహద్దు వాణిజ్యం, ప్రాంతీయ పెట్టుబడులను కూడా ఇది ప్రోత్సహిస్తుంది.

కారిడార్‌ మ్యాప్‌

ప్రాజెక్టు వివరాలు:

స్వరూపం

వివరాలు

ప్రాజెక్టు పేరు

బారాబంకి-బహ్రాయిచ్ మధ్య 4 వరుసల వినియోగ నియంత్రిత జాతీయ రహదారి-927

కారిడార్‌

లక్నో-రూపైదిహా

పొడవు (కిలోమీటర్లు)

101.515

మొత్తం వ్యయం (రూ.కోట్లలో)

3485.49

భూ సేకరణ వ్యయం (రూ.కోట్లలో)

1574.85

మొత్తం పెట్టుబడి వ్యయం (రూ.కోట్లలో)

6969.04

విధానం

హైబ్రిడ్‌ యాన్యుటీ విధానం (హెచ్‌ఏఎం)

బైపాస్‌ మార్గాల పొడవు

48.28 కిలోమీటర్లు

ప్రధాన సంధానిత రోడ్లు

జాతీయ రహదారులు.. ఎన్‌హెచ్‌-27, 330బి, 730

రాష్ట్ర రహదారులు... ఎస్‌హెచ్‌-13, 30బి

సంధానిత ఆర్థిక/సామాజిక/రవాణా కూడళ్లు

విమానాశ్రయాలు: లక్నో, శ్రావస్తి

రైల్వే స్టేషన్లు: బారాబంకి, రసౌలి, జంగీరాబాద్, రఫీనగర్, బిందౌరా, బుర్వాల్, చౌకఘాట్, ఘఘ్రాఘాట్, జర్వాల్, బహ్రైచ్

ల్యాండ్‌ పోర్ట్‌: రూపై దిహా

ఆర్థిక కూడళ్లు: 01 ఎస్‌ఈజడ్‌, 02 మెగా ఫుడ్ పార్క్

సామాజిక కూడళ్లు: 02 ఆకాంక్షాత్మక జిల్లాలు

సంధానిత ప్రధాన నగరాలు/పట్టణాలు

బారాబంకి, రామ్‌నగర్, జర్వాల్, కైసర్‌గంజ్, కుందసర్, ఫఖర్‌పూర్, బహ్రైచ్

ఉపాధి సృష్టి సామర్థ్యం

36.54 లక్షల (ప్రత్యక్ష) పనిదినాలు... 43.04 లక్షల (ప్రరోక్ష) పనిదినాలు

2028లో వార్షిక సగటు రోజువారీ వాహన రాకపోకలు (ఏఏడీటీ)

28,557 (ప్యాకేజీ-1), 21,270 (ప్యాకేజీ-2) పాసింజర్ కార్ యూనిట్లు (పీసీయూ)గా అంచనా.

 

****


(రిలీజ్ ఐడి: 2242009) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Kannada