పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖల స్థాయి సమీక్షా సమావేశం


భారతదేశ ముడి చమురు దిగుమతుల్లో 70 శాతం ఇప్పుడు హార్ముజ్ జలసంధి వెలుపలి నుండే సరఫరా

సురక్షితంగా కొనసాగుతున్న ఇంధన సరఫరా

మొత్తం ఎల్‌పీజీ వినియోగంలో దాదాపు 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్న భారత్

హార్ముజ్ జలసంధి ద్వారానే సుమారు 90 శాతం దిగుమతులు

ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిణామాల కారణంగా ఈ సరఫరా మార్గంపై ప్రభావం

ప్రభుత్వ చర్యల ఫలితంగా దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తిలో 25 శాతం వృద్ధి

రెస్టారెంట్లు, హోటళ్లు, వాణిజ్య వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరాను సమీక్షిస్తున్న ముగ్గురు సభ్యుల కమిటీ

పర్షియన్ జలసంధిలో ఉన్న 28 భారతీయ జెండా కలిగిన నౌకలపై నిరంతర నిఘా

దేశవ్యాప్తంగా స్థిరంగా కొనసాగుతున్న ఓడరేవులు కార్యకలాపాలు.. ఎగుమతి, దిగుమతుల (ఎగ్జిమ్) వాణిజ్య కొనసాగింపు కోసం ప్రత్యేక చర్యలు

గల్ఫ్ దేశాలలోని (జీసీసీ) కోటి మంది ప్రవాస భారతీయుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2026 7:56PM by PIB Hyderabad

పశ్చిమాసియాలో ఇటీవలి పరిణామాలపై నేడు జాతీయ మీడియా కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారుఆ ప్రాంతంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భారత ప్రభుత్వం చేపట్టిన సన్నద్ధతముందస్తు చర్యల గురించి పెట్రోలియంసహజ వాయువు మంత్రిత్వ శాఖవిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖఓడరేవులు నౌకాయాన జలమార్గాల మంత్రిత్వ శాఖసమాచార-ప్రసార మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు మీడియాకు వివరించారుఈ సమావేశంలో ఇంధన సరఫరా సన్నద్ధతసముద్ర భద్రతవిదేశాల్లోని భారతీయుల సంక్షేమంప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి తాజా సమాచారాన్ని అందించారు.

ఇంధన సరఫరాలభ్యత 

ఇంధన సరఫరాఇంధన లభ్యతపై పెట్రోలియంసహజ వాయువు మంత్రిత్వ శాఖ అధికారి మీడియాకు వివరించారుదేశంలో ఇంధన సరఫరా పరిస్థితినిరంతరాయ ఇంధన సరఫరాను నిర్ధారించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన తెలియజేశారు

ముడి చమురు

  • భారతదేశ ముడి చమురు సరఫరా సురక్షితంగా ఉందిభారతదేశ రోజువారీ వినియోగం సుమారు 55 లక్షల బ్యారెళ్లుగా ఉందివివిధ దేశాల నుంచి చమురును కొనుగోలు చేయటం ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న చమురు పరిమాణం సాధారణంగా హార్ముజ్ జలసంధి ద్వారా వచ్చే దాని కంటే ఎక్కువగా ఉంది.

  • ప్రస్తుతం సుమారు 40 దేశాల నుంచి భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోందిఈ వైవిధ్యీకరణ ఫలితంగా గతంలో 55 శాతంగా ఉన్న హార్ముజ్ జలసంధి వెలుపలి మార్గాల దిగుమతులు ఇప్పుడు 70 శాతానికి చేరుకున్నాయి.

  • దీనికి అందనంగా మరో రెండు ముడి చమురు నౌకలు ఇప్పటికే మార్గ మధ్యంలో ఉన్నాయి. ఇవి రాబోయే కొద్ది రోజుల్లో భారత్‌కు చేరుకుంటాయితద్వారా ముడి చమురు సరఫరా పరిస్థితి మరింత బలోపేతం అవుతుంది.

  • దేశ వ్యాప్తంగా ఉన్న చమురు శుద్ధి కేంద్రాలు అత్యధిక సామర్థ్యంతో పనిచేస్తున్నాయికొన్ని సందర్భాల్లో ఇవి 100 శాతానికి పైగా సామర్థ్యంతో నడుస్తున్నాయి.

సహజ వాయువు

  • భారతదేశపు మొత్తం సహజ వాయు వినియోగం సుమారు 189 ఎంఎంఎస్‌సీఎండీ కాగా అందులో 97.5 ఎంఎంఎస్‌సీఎండీ దేశీయంగా ఉత్పత్తి అవుతోందిఅనివార్య కారణాల వల్ల సుమారు 47.4 ఎంఎంఎస్‌సీఎండీ సరఫరాపై ప్రభావం పడింది.

  • ఈ అంతరాయాన్ని భర్తీ చేయడానికి ప్రత్యామ్నాయ సరఫరామార్గాల ద్వారా సేకరణ ప్రక్రియ కొనసాగుతోందిగ్యాస్ కంపెనీలు కొత్త వనరుల నుంచి ఎల్‌ఎన్‌జీ నౌకలను కూడా ఖరారు చేశాయిప్రస్తుతం రెండు ఎల్‌ఎన్‌జీ నౌకలు దేశానికి వస్తున్నాయి.

  • గ్యాస్ సరఫరాను నిర్వహించడానికిప్రాధాన్యత కలిగిన రంగాలను రక్షించడానికి ప్రభుత్వం 2026 మార్చి 9 'నిత్యావసర సరుకుల చట్టంకింద 'సహజ వాయువు కంట్రోల్ ఆర్డర్' జారీ చేసింది.

  • గృహ అవసరాలకు వాడే పీఎన్‌జీ సరఫరావాహనాలకు వాడే సీఎన్‌జీ‌కి ఎటువంటి కోతలు లేకుండా 100 శాతం సరఫరా ఉంటుంది

  • గ్యాస్ గ్రిడ్‌కు అనుసంధానమైన టీ పరిశ్రమలుఉత్పాదక యూనిట్లుఇతర పారిశ్రామిక వినియోగదారులకు వారి గత ఆరు నెలల సగటు సరఫరాలో సుమారు 80 శాతం అందుతుంది.

  • ఎరువుల కర్మాగారాలకు సుమారు 70 శాతం సరఫరా అందుతుందిఅదే సమయంలో అధిక ప్రాధాన్యత కలిగిన రంగాలను రక్షించడానికి చమురు శుద్ధి కేంద్రాలుపెట్రోకెమికల్ కేంద్రాల సరఫరాలో సుమారు 35 శాతం తగ్గింపు ఉంటుంది.

ఎల్‌పీజీ

  • భారతదేశపు ఎల్‌పీజీ వినియోగంలో సుమారు 60 శాతం దిగుమతి అవుతోందిఈ దిగుమతుల్లో సుమారు 90 శాతం హార్ముజ్ జలసంధి ద్వారా వస్తాయిప్రస్తుతం అక్కడున్న పరిణామాల వల్ల ఈ సరఫరా మార్గం ప్రభావితమైంది.

  • చమురు శుద్ధి కేంద్రాలుపెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లలో ప్రొపేన్బ్యూటేన్ప్రొపిలీన్బ్యూటేన్ స్ట్రీమ్‌లను ఎల్‌పీజీ పూల్‌కు మళ్లించడం ద్వారా ఎల్‌పీజీ ఉత్పత్తిని గరిష్ఠ స్థాయికి తీసుకెళ్లాలని 2026 మార్చి 8న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందిఈ చర్యల ఫలితంగా దేశీయ ఎల్‌పీజీ ఉత్పత్తి సుమారు 25 శాతం పెరిగిందిఈ మొత్తం దేశీయ ఉత్పత్తిని గృహ వినియోగదారులకు మళ్లిస్తున్నారు.

  • గృహేతర ఎల్‌పీజీ అవసరాల కోసం ఆసుపత్రులువిద్యాసంస్థలు వంటి అత్యవసర రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

  • రెస్టారెంట్లుహోటళ్లుఇతర వాణిజ్య వినియోగదారులకు ఎల్‌పీజీ కేటాయింపులను సమీక్షించడానికి.. అందుబాటులో ఉన్న ఎల్‌పీజీ సరఫరాను నిష్పక్షపాతంగాపారదర్శకంగా పంపిణీ చేయడానికి వీలుగా ఐఓసీఎల్హెచ్‌పీసీఎల్బీపీసీఎల్ సంస్థల నుంచి ముగ్గురు కార్యనిర్వహక డైరెక్టర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు

  • ఇటీవల రూ. 60 పెరిగిన తర్వాత ఢిల్లీలో గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ప్రస్తుత ధర రూ. 913గా ఉందిఅయితే పీఎంయూవై లబ్ధిదారులకు సిలిండర్ ధర రూ. 613 వద్దే కొనసాగుతోంది.

  • పీఎంయూవై గృహాలకు సంబంధించి ఇటీవలి ధరల పెరుగుదల రోజుకు 80 పైసల కంటే తక్కువ భారాన్నే మోపుతుంది

  • 2023 జూలై నుంచి సౌదీ కాంట్రాక్ట్ ధర సుమారు 41 శాతం పెరిగినప్పటికీ ప్రభుత్వ మద్దతు కారణంగా పీఎంయూవై సిలిండర్ ధర అదే కాలంలో సుమారు 32 శాతం తగ్గింది.

  • ఎల్‌పీజీ విక్రయాల వల్ల చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఏర్పడిన నష్టాల భర్తీ కోసం ప్రభుత్వం రూ.30,000 కోట్ల పరిహారాన్ని ఆమోదించింది.

  • క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం కొంతమంది ఆందోళనతో ముందస్తు బుకింగ్‌లు చేయడంనిల్వ చేసే ధోరణి కనిపిస్తోందిఅయినప్పటికీ గృహ వినియోగ ఎల్‌పీజీ సాధారణ డెలివరీ సమయం సుమారు 2.5 రోజులుగానే ఉందికాబట్టి వినియోగదారులు ఆందోళనతో సిలిండర్లను బుక్ చేయొద్దని సూచిస్తున్నాం.  

  • పంపిణీదారుల స్థాయిలో గ్యాస్ మళ్లింపును నిరోధించడానికి 'డెలివరీ అథెంటికేషన్ కోడ్వ్యవస్థను సుమారు 90 శాతం వినియోగదారులకు పెంచాం

  • తాత్కాలిక డిమాండ్ నిర్వహణ చర్యలో భాగంగా ఎల్‌పీజీ బుకింగ్‌ల మధ్య ఉండాల్సిన కనీస సమయాన్ని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచాం

  • డిస్ట్రిబ్యూటర్ల వద్ద పేరుకుపోయిన ఆర్డర్లను పూర్తి చేయడానికిపంపిణీ సజావుగా సాగేలా చూడటానికి చమురు మార్కెటింగ్ కంపెనీలుఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తున్నాయి.

  • ప్రభుత్వం అంతర్జాతీయ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోందిఇంధన సరఫరాలో అంతరాయం కలగకుండా చూడటానికి.. గృహ అవసరాలనుప్రాధాన్యత కలిగిన రంగాలను రక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటోంది.

సముద్ర భద్రతనౌకాయాన కార్యకలాపాలు

పర్షియన్ జల సంధి ప్రాంతంలో ప్రస్తుత సముద్ర స్థితిగతులు.. భారతీయ సిబ్బందినౌకలుసముద్ర వాణిజ్య కార్యకలాపాలను రక్షించడానికి తీసుకుంటున్న చర్యల గురించి ఓడరేవులునౌకాయానజలమార్గాల మంత్రిత్వ శాఖ మీడియాకు వివరించిందిమంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం:

  • ప్రస్తుతం పర్షియన్ జల సంధి ప్రాంతంలో 28 భారతీయ జెండా కలిగిన నౌకలు నడుస్తున్నాయివీటిలో 24 నౌకలు హార్ముజ్ జలసంధికి పశ్చిమ దిశలో 677 మంది భారతీయ సిబ్బందితో ఉండగా నౌకలు జలసంధికి తూర్పు దిశలో 101 మంది భారతీయ సిబ్బందితో ఉన్నాయివారి భద్రతరక్షణను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం

  • పరిణామాలను పర్యవేక్షించడానికిసహాయక చర్యలను సమన్వయం చేసేందుకు 2026 ఫిబ్రవరి 28 నుంచి మంత్రిత్వ శాఖడైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్‌లో 24 గంటల పనిచేసే కంట్రోల్ రూం అందుబాటులోకి వచ్చింది.

  • భారతీయ జెండా కలిగిన నౌకలుభారతీయ సిబ్బంది మెరుగైన భద్రతా చర్యలను చేపట్టాలని.. అలాగే సిబ్బంది వివరాలను సమర్పించడంతో పాటు రిపోర్టింగ్ ప్రోటోకాల్స్‌ను పాటించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ 2026 ఫిబ్రవరి 28 సూలనలను జారీ చేసింది.

  • భారతీయ సిబ్బందికి అవసరమైన చోట రక్షణసహాయం అందించడానికి అధికారులునౌకల నిర్వాహకులునియామక సంస్థలుభారత రాయబార కార్యాలయాలుస్థానిక అధికారులు కలిసి సమన్వయంతో పనిచేస్తున్నారు

  • దేశవ్యాప్తంగా ఓడరేవుల కార్యకలాపాలు స్థిరంగా కొనసాగుతున్నాయిఎగుమతిదారులకు ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడానికిఎగుమతి-దిగుమతి (ఎగ్జిమ్వాణిజ్యం కొనసాగేలా చూసుకునేందుకు అవసరమైన సహాయం అందించాలని అన్ని ఓడరేవులకు ఆదేశాలు జారీ చేశాం

  • నౌకల కదలికలను ప్రధాన ఓడరేవులు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయిఆ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ నౌకలుసరకు స్థితిగతులపై క్రమం తప్పకుండా నివేదికలను అందిస్తున్నాయి.

  • భారతీయ సిబ్బందిభారతీయ జెండా కలిగిన నౌకల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి పర్షియన్ జల సంధి ప్రాంతంలో మారుతున్న సముద్ర స్థితిగతులను మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తోంది.

  • సముద్ర వాణిజ్యంసిబ్బందికి అవసరమైన మద్దతును అందించడానికి పరిశ్రమలోని భాగస్వాములతో మంత్రిత్వ శాఖ క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతోంది.

  • భారతీయ సిబ్బంది భద్రతసంక్షేమాన్ని నిర్ధారించడానికి.. అలాగే భారతదేశ సముద్ర ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ఆ ప్రాంతంలోని భారతీయ పౌరుల భద్రత

ఆ ప్రాంతంలో ఉన్న భారతీయ పౌరుల పరిస్థితిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని అందించిందిప్రవాస భారతీయుల భద్రతసంక్షేమాన్ని నిర్ధారించడానికి భారత రాయబార కార్యాలయాల ద్వారా జరుగుతున్న కృషిని వివరిస్తూ ఇలా పేర్కొంది:

  • గల్ఫ్ సహకార మండలి (జీసీసీదేశాల్లో సుమారు ఒక కోటి మంది భారతీయులు ఉన్నారువారి సంక్షేమంభద్రత.. ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం.

  • యూఏఈఖతార్సౌదీ అరేబియాఒమన్బహ్రెయిన్కువైట్జోర్డాన్ఇజ్రాయెల్‌తో సహా పలు గల్ఫ్పశ్చిమాసియా దేశాల నాయకులతో ప్రధాన మంత్రి మాట్లాడారు.

  • విదేశీ వ్యవహారాల మంత్రి కూడా ఈ దేశాలలోని ఆయా దేశాల విదేశాంగ మంత్రులుఇరాన్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

  • ఆ ప్రాంతంలోని భారత రాయబార కార్యాలయాలు భారతీయ పౌరుల కోసం క్రమం తప్పకుండా సూచనలను(అడ్వైజరీజారీ చేస్తున్నాయి.

  • రాయబారులుకాన్సుల్ జనరల్స్ అక్కడి భారతీయులతో కలిసి వారి భద్రతరక్షణను నిర్ధారిస్తున్నారు.

  • మస్కట్రియాద్జెడ్డా వంటి ప్రాంతాల నుంచి పర్యాటకులుట్రాన్సిట్ ప్రయాణికులతో సహా చిక్కుకుపోయిన భారతీయులను అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల ద్వారా స్వదేశానికి తిరిగి రావడానికి భారత బృందాలు సహాయం చేశాయి.

  • భారతీయ పౌరులకు సహాయం అందించడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది.

  • వాణిజ్య నౌకలు దాడికి గురైన సంఘటనల్లో ఇద్దరు భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోగా ఒకరి ఆచూకీ తెలియటం లేదువారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం

  • గాయపడిన కొంతమంది భారతీయ పౌరులు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారువారికి భారత బృందాలు అవసరమైన సహాయాన్ని అందిస్తున్నాయిఇజ్రాయెల్‌లో గాయపడిన ఒక భారతీయ పౌరుడు వేగంగా కోలుకుంటుండగా దుబాయ్‌లో గాయపడిన మరొకరు భారత కాన్సులేట్‌తో సంప్రదింపుల్లో ఉన్నారు.

  • ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 9,000 మంది భారత పౌరులు ఉన్నారుఅక్కడి భారత అధికారులు..  నిరంతరం వారిని సంప్రదిస్తున్నారు.

  • ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులుయాత్రికులను టెహ్రాన్ వెలుపల ఉన్న సురక్షితమైన నగరాలకు తరలించాం

  • ఆర్మేనియాఅజర్‌బైజాన్ దేశాల్లోకి భూ సరిహద్దుల ద్వారా ప్రవేశించే విషయంతో పాటు అక్కడి నుంచి వాణిజ్య విమానాల ద్వారా భారత్‌కు తిరిగి రావడానికి అవసరమైన సహాయాన్ని కూడా ప్రభుత్వం అందిస్తోంది.

  • తాజా సమాచారంనిరంతర అప్‌డేట్ల కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖభారత రాయబార కార్యాలయాలకు సంబంధించిన అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ప్రజలు అనుసరించాలి

ప్రజలకు సమాచారం అందించటంనిత్యావసర సరకుల పర్యవేక్షణ

ఈ సమీక్షా సమావేశంలో సమాచారప్రసార మంత్రిత్వ శాఖ అధికారి ఈ కింది విషయాలను చెప్పారు:

  • అన్ని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులుపోలీస్ డైరెక్టర్ జనరల్‌లతో కేంద్ర హోం కార్యదర్శి సమావేశం నిర్వహించారు.

  • నిత్యావసర సరుకులను అక్రమంగా నిల్వ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనివాటి లభ్యతలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు సూచించాం.

  • ప్రజలకు క్రమం తప్పకుండావిశ్వసనీయమైన సమాచారాన్ని అందించడానికి రాష్ట్ర స్థాయి ప్రతినిధిని నియమించాలని రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు సలహా ఇచ్చారు

  • ధ్రువీకరణ కలిగిన సమాచారాన్ని ప్రభుత్వ అధికారిక సామజిక మాధ్యమ ఖాతాలుజిల్లా యంత్రాంగాలుమీడియా భాగస్వాముల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలి.

  • సమాచారాన్ని ప్రజలకు చేరవేటంలో స్థానిక యంత్రాంగాన్ని సాధనంగా వినియోగించుకోవాలిజిల్లా కలెక్టర్లుపోలీస్ కమిషనర్లుమున్సిపల్ అధికారులు ప్రజలతో నేరుగా మమేకమై.. వారికి విశ్వసనీయమైన సమాచారాన్ని అందించే వనరులుగా వ్యవహరించాలి.

పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులను భారత ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని.. సంబంధిత మంత్రిత్వ శాఖలుసంస్థల మధ్య నిరంతర సమన్వయాన్ని కొనసాగిస్తోందని ఈ సమీక్షా సమావేశం ప్రధానంగా తెలియజేసిందిఇంధన భద్రతను నిర్ధారించటంఆ ప్రాంతంలోని భారతీయ పౌరులను రక్షించటంసముద్ర కార్యకలాపాల భద్రతను కాపాడటంనిత్యావసర వస్తువుల నిరంతర లభ్యతను నిర్ధారించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పునరుద్ఘాటించారుమారుతున్న పరిస్థితుల్లో ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడానికి.. దేశ ప్రయోజనాలను కాపాడటానికి సకాలంలో తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

 

***


(రిలీజ్ ఐడి: 2238757) సందర్శకుల సూచీ సంఖ్య : : 130
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam