ప్రధాన మంత్రి కార్యాలయం
కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం వ్యవస్థాపక దినోత్సవం.. ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
10 MAR 2026 10:35AM by PIB Hyderabad
కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) ఏర్పాటు దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ఆ దళ సిబ్బందికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దృఢ సంకల్పానికీ, క్రమశిక్షణకీ, అంకితభావానికీ ప్రసిద్ధి చెందిన సీఐఎస్ఎఫ్, దేశమంతటా కీలక మౌలిక సదుపాయాల భద్రతను పరిరక్షించడంలో కీలక భూమికను నిర్వర్తిస్తోంది. కర్తవ్య పాలన పట్ల వారి తిరుగులేని నిబద్ధత భారత భద్రతా పరిరక్షణలోనూ, ప్రగతి సాధనలోనూ కీలక తోడ్పాటును అందిస్తోంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ఆ దళ సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు.
‘‘దృఢ సంకల్పానికీ, క్రమశిక్షణకీ, అంకితభావానికీ ప్రసిద్ధి చెందిన సీఐఎస్ఎఫ్.. దేశమంతటా కీలక మౌలిక సదుపాయాల భద్రతను పరిరక్షించడంలో కీలక భూమికను నిర్వర్తిస్తోంది. కర్తవ్య పాలన పట్ల వారి తిరుగులేని నిబద్ధత భారత భద్రతా పరిరక్షణలోనూ, ప్రగతి సాధనలోనూ కీలక తోడ్పాటును అందిస్తోంది’’ అని పేర్కొన్నారు.
***
(రిలీజ్ ఐడి: 2237361)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam