ప్రధాన మంత్రి కార్యాలయం
క్రీడల్లో మహిళలను ప్రోత్సహించే 'అస్మిత' కార్యక్రమంపై వచ్చిన ఒక వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
08 MAR 2026 4:37PM by PIB Hyderabad
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీమతి రక్షా ఖడ్సే రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
దేశవ్యాప్తంగా మహిళల్లో క్రీడలను ప్రోత్సహించడానికి ఖేలో ఇండియా మిషన్లో భాగంగా రూపొందించిన విజయవంతమైన 'అస్మిత' కార్యక్రమాన్ని ఇది వివరిస్తోంది. క్రీడల్లో లింగ వివక్ష లేని వాతావరణాన్ని తీసుకురావడానికి క్రీడల మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను ఇది ప్రధానంగా తెలియజేస్తోంది. 2047 నాటికి 'వికసిత్ భారత్' నిర్మించాలనే దార్శనికతలో 'అస్మిత' కీలక పాత్ర పోషిస్తుందని ఈ వ్యాసం పేర్కొంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ విధంగా పేర్కొన్నారు:
“ఈ కథనంలో దేశవ్యాప్తంగా మహిళల్లో క్రీడలను ప్రోత్సహించడానికి రూపొందించిన ఖేలో ఇండియా మిషన్లో విజయవంతమైన 'అస్మిత' కార్యక్రమం గురించి కేంద్ర సహాయ మంత్రి రక్షా ఖడ్సే రాశారు.
క్రీడల్లో లింగ తటస్థత కోసం క్రీడల మంత్రిత్వ శాఖ ఇస్తున్న ప్రాధాన్యతను ఆమె ప్రధానంగా చెప్పారు. అలాగే 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణంలో 'అస్మిత' కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు."
(రిలీజ్ ఐడి: 2236650)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam