ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జోర్డాన్ రాజుతో మాట్లాడిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 MAR 2026 9:45PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా IIతో మాట్లాడారు.

ప్రాంతంలో మారుతున్న పరిస్థితుల పట్ల ప్రధానమంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారుజోర్డాన్ ప్రజల శాంతిభద్రతసంక్షేమానికి తమ మద్దతు ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

ఈ క్లిష్ట సమయంలో జోర్డాన్‌లోని భారతీయుల క్షేమం పట్ల జాగ్రత్త తీసుకుంటున్నందుకు జోర్డాన్ రాజుకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

"జోర్డాన్ రాజు అబ్దుల్లా IIతో మాట్లాడానుఆ ప్రాంతంలో మారుతున్న పరిస్థితుల పట్ల మా తీవ్ర ఆందోళనన తెలియజేశానుజోర్డాన్ ప్రజల శాంతిభద్రతసంక్షేమానికి మా మద్దతును పునరుద్ఘాటించడంతో పాటు ఈ క్లిష్ట సమయంలో అక్కడి భారతీయులను జాగ్రత్తగా చూసుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశానుఅని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు

 

***


(రిలీజ్ ఐడి: 2234810) సందర్శకుల సూచీ సంఖ్య : : 73