ప్రధాన మంత్రి కార్యాలయం
తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్ జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు
నాడు పోస్టు చేయడమైనది:
28 FEB 2026 7:03PM by PIB Hyderabad
తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్ జట్టును ప్రధానమంత్రి అభినందించారు.
ఈ చరిత్రాత్మక విజయం జట్టులోని ఆటగాళ్ల ధైర్యాన్ని, క్రమశిక్షణను, ఆట పట్ల వారి అభిరుచిని ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజలకు గర్వకారణమైన క్షణం... ఈ విజయం ఈ ప్రాంత ప్రజల్లో పెరుగుతున్న క్రీడాభిరుచిని, వారి ప్రతిభను స్పష్టం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఘనత చాలా మంది యువ అథ్లెట్లు పెద్ద కలలు కనడానికి, మరిన్ని ఆటల్లో రాణించడానికి స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"తొలిసారి రంజీ ట్రోఫీ గెలిచిన జమ్మూ కాశ్మీర్ జట్టుకు అభినందనలు! ఈ చరిత్రాత్మక విజయం జట్టులోని ఆటగాళ్ల ధైర్యాన్ని, క్రమశిక్షణను, క్రీడల పట్ల వారి అభిరుచిని ప్రతిబింబిస్తోంది. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజలకు గర్వకారణమైన క్షణం. అక్కడి ప్రజల్లో పెరుగుతున్న క్రీడాభిరుచిని, వారి ప్రతిభను ఇది హైలైట్ చేస్తుంది. ఈ విజయం చాలా మంది యువ అథ్లెట్లు పెద్ద కలలు కనడానికి, వారు మరిన్ని క్రీడల్లో రాణించడానికి స్ఫూర్తినిస్తుంది."
(రిలీజ్ ఐడి: 2234081)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4