ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

2026-27 సీజన్‌కు ముడి జనపనారకు కనీస మద్దతు ధరలకు కేబినెట్ ఆమోదం

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2026 3:37PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ.. 2026-27 మార్కెటింగ్ సీజనుకు సంబంధించి ముడి జనపనార కనీస మద్దతు ధరలకు ఈ రోజు ఆమోదం తెలిపింది.

2026-27 సీజనుకు గాను ముడి జనపనార (టీడీ-3 గ్రేడ్కనీస మద్దతు ధరను క్వింటాలుకు రూ5,925/- గా నిర్ణయించిందిఇది అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయంపై 61.8 శాతం లాభాన్ని అందిస్తుందిభారత ప్రభుత్వం 2018-19 బడ్జెటులో ప్రకటించిన మేరకుఅఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయానికి కనీసం 1.5 రెట్లు కనీస మద్దతు ధర ఉండాలన్న సూత్రానికి అనుగుణంగా.. 2026-27 మార్కెటింగ్ సీజనుకు సంబంధించి ముడి జనపనారకు ఎంఎస్పీని నిర్ణయించారు.

గత 2025-26 సీజనుతో పోలిస్తే.. 2026-27 మార్కెటింగ్ సీజనుకు ప్రకటించిన ముడి జనపనార కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ275/- పెరిగిందిముడి జనపనార కనీస మద్దతు ధర 2014-15లో క్వింటాలుకు రూ2,400/- ఉండగా2026-27 నాటికి ప్రభుత్వం దానిని రూ5,925/- కు పెంచిందిఅంటే క్వింటాలుకు రూ3,525/- (2.5 రెట్లుపెరుగుదల నమోదైంది.

2014-15 నుంచి 2025-26 వరకు జనపనార రైతులకు చెల్లించిన కనీస మద్దతు ధర రూ. 1342 కోట్లుకాగా 2004-05 నుంచి 2013-14 వరకు చెల్లించిన మొత్తం రూ. 441 కోట్లు మాత్రమే.

ధరల మద్దతు కార్యకలాపాలను చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వ నోడల్ సంస్థగా భారత జనపనార కార్పొరేషన్ (జేసీఐకొనసాగుతుందిఆ కార్యకలాపాల్లో ఏదైనా నష్టం వాటిల్లితే.. ఆ మొత్తాన్నీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తిరిగి చెల్లిస్తుంది.  

 

****


(రిలీజ్ ఐడి: 2232259) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Tamil , Malayalam , Marathi , Assamese , Bengali , Odia , English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Kannada