ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
మహారత్న సీపీఎస్ఈలకు అధికారాల అప్పగించే ప్రస్తుత మార్గదర్శకాల నుంచి పవర్గ్రిడ్కు అదనపు అధికారాలను కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఈక్విటీ పెట్టుబడి పరిమితిని ప్రతి అనుబంధ సంస్థకు రూ.5000 కోట్ల నుంచి రూ.7500 కోట్లకు పెంచడానికి వీలుగా అదనపు అధికారాలు
నాడు పోస్టు చేయడమైనది:
24 FEB 2026 3:35PM by PIB Hyderabad
మహారత్న సీపీఎస్ఈలకు వర్తించే అధికారాల అప్పగింతపై ప్రభుత్వ సంస్థల విభాగం (డీపీఈ) ఫిబ్రవరి 4, 2010 నాటి మార్గదర్శకాల ప్రకారం పవర్గ్రిడ్కి మెరుగైన అధికారాలు కల్పించే నిర్ణయానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ రోజు ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం కంపెనీ నికర విలువలో 15 శాతంగా ఉన్న ప్రస్తుత పరిమితిని నిలుపుకుంటూనే పవర్ గ్రిడ్ కోసం అనుమతించదగిన ఈక్విటీ పెట్టుబడి పరిమితిని ప్రతి అనుబంధ సంస్థకు రూ.5,000 కోట్ల నుంచి రూ.7,500 కోట్లకు పెంచడానికి వీలు కల్పించింది.
ఈ ఆమోదం దేశంలో అతిపెద్ద, అత్యంత అనుభవం గల ట్రాన్స్మిషన్ సర్వీస్ ప్రొవైడర్ అయిన పవర్గ్రిడ్ తన ప్రధాన వ్యాపారంలో పెట్టుబడిని విస్తరించుకోవడానికి, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని తరలించడంలో మద్దతునివ్వడానికి వీలు కల్పిస్తుంది. శిలాజేతర వనరుల ద్వారా 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించడంలోనూ ఇది సహాయపడుతుంది.
పవర్గ్రిడ్ ఇప్పుడు అల్ట్రా హై వోల్టేజ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ (యూహెచ్వీఏసీ), హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ (హెచ్వీడీసీ) ట్రాన్స్మిషన్ నెట్వర్క్ల వంటి క్యాపిటల్-ఇంటెన్సివ్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుల బిడ్లలో పాల్గొనడానికి వీలుంటుంది. కీలకమైన ట్రాన్స్మిషన్ ప్రాజెక్టుల బిడ్డర్ల ఎంపిక కోసం టారిఫ్ బేస్డ్ కాంపిటీటివ్ బిడ్డింగ్ (టీబీసీబీ)లో పోటీనీ ఇది విస్తృతం చేస్తుంది. ఇది మెరుగైన ధరల ఆవిష్కరణను నిర్ధారిస్తుంది. వినియోగదారులకు సరసమైన, స్వచ్ఛమైన ఇంధనం అందుబాటులో ఉండేలా చేస్తుంది.
****
(రిలీజ్ ఐడి: 2232237)
సందర్శకుల సూచీ సంఖ్య : : 19
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam