ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ షూఫ్ భారతదేశ పర్యటన

నాడు పోస్టు చేయడమైనది: 19 FEB 2026 8:47PM by PIB Hyderabad

నెదర్లాండ్స్ ప్రధానమంత్రి శ్రీ డిక్ షూఫ్‌తో 19 ఫిబ్రవరి 2026 నాడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. 'ఏఐ ఇంపాక్ట్ సదస్సు'కు హాజరైన నెదర్లాండ్స్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ప్రధానమంత్రి షూఫ్ నాయకత్వం వహిస్తున్నారు.

ఈ సదస్సుకు హాజరైనందుకు ప్రధానమంత్రి షూఫ్‌కు శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. 'ఆర్థిక వృద్ధిసామాజిక శ్రేయస్సు కోసం ఏఐ’ వర్కింగ్ గ్రూప్‌కు సహాధ్యక్ష దేశంగా నెదర్లాండ్స్ అందిస్తున్న సహకారాన్ని ఆయన కొనియాడారుఈ సదస్సుకు ఉన్న ప్రాముఖ్యతను ప్రధానమంత్రి షూఫ్ ప్రధానంగా చెప్పారుఈ 'సదస్సు ప్రకటనభవిష్యత్తు విధానపరమైన చర్చలకు దిశానిర్దేశం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఏఐ ఆవిర్భావం సాంకేతిక పరిణామంలో ఒక కీలక మలుపు అని.. ఇది సమాజానికి గొప్ప అవకాశాలను అందిస్తుందని ఇరు దేశాల నాయకులు అంగీకరించారుసామాజిక పరివర్తన సాధించడానికి ఏఐ పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడంలో భారత్నెదర్లాండ్స్ కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని వారు ప్రధానంగా చెప్పారుఈ నేపథ్యంలో ఏఐక్వాంటంసెమీకండక్టర్లతో సహా వర్ధమాన సాంకేతిక రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడంపై నేతలు చర్చించారు.

ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించిన ఇరు దేశాల నాయకులు.. భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యంలో కనిపిస్తున్న స్థిరమైన పురోగతిని స్వాగతించారుడబ్ల్యూఏహెచ్ (నీరువ్యవసాయంఆరోగ్యం), స్వచ్ఛ ఇంధనంహరిత హైడ్రోజన్రక్షణ భద్రతవిద్య ప్రజల మధ్య సంబంధాలు వంటి వివిధ రంగాలలో ఈ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే నిబద్ధతను వారు పునరుద్ఘాటించారుఇరు దేశాల మధ్య వాణిజ్య ఆర్థిక భాగస్వామ్యంలో ఉన్న పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన కీలక చర్చలు ముగియడం ఒక చారిత్రాత్మక అవకాశమని వారు అంగీకరించారు.

ముఖ్యమైన ప్రాంతీయఅంతర్జాతీయ పరిణామాలపై ఇద్దరు నాయకులు అభిప్రాయాలను పంచుకున్నారుప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి అంతర్జాతీయ వేదికలపై కలిసి పనిచేసే విషయంలో వారు నిబద్ధతను పునరుద్ఘాటించారుఉక్రెయిన్ వివాదంపై భారత్ వైఖరిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేస్తూ.. అక్కడ యుద్ధం వీలైనంత త్వరగా ముగియాల్సిన అవసరం ఉందన్నారుఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరాటాన్ని బలోపేతం చేయాలని ఇరు దేశాల నేతలు నిర్ణయించారు.

వాణిజ్యంపెట్టుబడులుడబ్ల్యూఏహెచ్ (నీరువ్యవసాయంఆరోగ్యంరంగాలుప్రజల మధ్య సంబంధాల వంటి సంప్రదాయ రంగాలతో భారత్-నెదర్లాండ్స్ భాగస్వామ్యం గణనీయంగా బలపడిందిఇటీవల ఈ బంధం వ్యూహాత్మక రంగాలైన సాంకేతికతఆవిష్కరణలురక్షణ భద్రతపునరుత్పాదక ఇంధనంవిద్య సముద్రయాన రంగాలకు సైతం విస్తరించింది.

 

***


(రిలీజ్ ఐడి: 2230646) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam