ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav AI Impact Summit 2026

విభిన్న అవసరాలను, వాస్తవ సవాళ్లను పరిష్కరించే దిశగా ఇండియా ఏఐ మిషన్ రూపకల్పన: ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఎస్ కృష్ణన్


‘‘అల్గారిథమ్‌ల నుంచి ఫలితాల వరకు: ప్రజల కోసం పనిచేసే
ఏఐను నిర్మించడం’’ అనే సెషన్లో ప్రసంగించిన ఎలక్ట్రానిక్స్, ఐటీ కార్యదర్శి

ఏఐని ఉపయోగించి ప్రభావంతమైన అప్లికేషన్లను తయారు చేయడం గురించి
చెప్పేదే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు: శ్రీ ఎస్.కృష్ణన్
ఏఐని ఏ రంగాల్లో ఉపయోగిస్తున్నారో తెలుసుకోవడానికి ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన

600కు పైగా అంకుర సంస్థలు, ఇతర సంస్థలను సందర్శించాలని కోరిన కార్యదర్శి

నాడు పోస్టు చేయడమైనది: 17 FEB 2026 3:42PM by PIB Hyderabad

ప్రజా కేంద్రక ఏఐసార్వభౌమ సాంకేతిక సామర్థ్యం అనే రెండు ముఖ్యమైన అంశాలను పరిశీలించే అత్యంత ప్రభావవంతమైన కార్యక్రమంతో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 రెండో రోజు ప్రారంభమైంది.

 

ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో ‘‘అల్గారిథమ్‌ల నుంచి ఫలితాల వరకుప్రజల కోసం పనిచేసే ఏఐను నిర్మించడం’’ అనే కార్యక్రమం జరిగిందిదీనిలో ప్రభుత్వ సేవలను అందించడంలోప్రజా సంక్షేమంలో కృత్రిమ మేధ వ్యవస్థలు మార్పులను ఎలా తీసుకువస్తాయనే అంశంపై దృష్టి సారించారుఅంతిమంగా ఉత్పాదకతను పెంచేవిగాపరిపాలనను బలోపేతం చేసేవిగాపౌరులకు స్పష్టమైన ప్రయోజనాలను అందించే అప్లికేషన్‌లుగా గణననమూనాలుడేటా ఎలా మారాలనే అంశంపై ఈ చర్చ సాగింది.

 

విభిన్న అవసరాలనువాస్తవ ప్రపంచ సవాళ్లను పరిష్కరించేలా భారత దేశ ఏఐ మిషన్ రూపుదిద్దుకుందని ఎలక్ట్రానిక్స్ఐటీ మంత్రిత్వశాఖ కార్యదర్శి ఎస్కృష్ణన్ అన్నారుఏఐని ఉపయోగించుకొని ప్రభావవంతమైన అప్లికేషన్లను తయారు చేయడమే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు ముఖ్యోద్దేశమని ఆయన చెప్పారు. ‘‘వాస్తవ ప్రభావంతో అప్లికేషన్లను తయారుచేయాలనే ఒకే ఒక్క కారణంతో అవసరమైన గణననమూనాలుడేటాను మేం అందిస్తున్నాంఅంచనాలను మించి ఏఐ విజయవంతం అవుతుందా లేదా అనేది అది ప్రజల జీవితాలను మెరుగుపరిచే పరిష్కారాలను అందించడంపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుందిఈ ఎక్స్‌పోలో మీరు ఆరోగ్యంవ్యవసాయంవిద్యతయారీ రంగాల్లో పని చేస్తున్న వందలాది అంకుర సంస్థలను చూడవచ్చుప్రభావం అనేది అక్కడి నుంచే మొదలవుతుందిప్రభుత్వాల దగ్గర ఎప్పుడూ తగినంత మంది ఉపాధ్యాయులువైద్యులు లేదా న్యాయమూర్తులు ఉండకపోవచ్చుకానీ ఏఐ ద్వారా ఉత్పాదకతను పెంచగలిగితే సేవల నాణ్యత గణనీయంగా మెరుగుపడుతుందిసరైన వాటిని ఎంచుకోవడంవాటిని బాధ్యతాయుతంగా విస్తరించడంగోప్యతను రక్షించడంప్రభుత్వ నిధులు స్పష్టమైన ఫలితాలను అందించేలా చూడటమే మన ముందున్న సవాలు” అని కార్యదర్శి అన్నారుఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన 600కు పైగా అంకుర సంస్థలుఇతర సంస్థలను సందర్శించిఎలాంటి రంగాల్లో ఏఐను ఉపయోగించవచ్చో ప్రత్యక్షంగా తెలుసుకోవాలని ఈ కార్యక్రమానికి హాజరైన వారిని కోరారు.

ఈ కార్యక్రమంలో జే-పాల్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్బాల్ సింగ్ దాలివాల్చికాగో విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యులు మైఖేల్ క్రెమెర్ఇతర విధాన రూపకర్తలుఈ రంగంలో ప్రముఖులు పాల్గొన్నారు.

కచ్చితమైన మూల్యాంకనం ప్రాధాన్యాన్ని జే-పాల్ గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇక్బాల్ సింగ్ దాలివాల్ వివరించారు. ‘‘అభివృద్ధిలో ఎన్నో పరిష్కారాలు వేగంగా వచ్చి వెళ్లిపోవడం మీరు చూసి ఉంటారుసాంకేతిక సిద్ధాంతపరంగా లేదా ల్యాబ్ వాతావరణంలో ఓ పరిష్కారం అద్భుతంగా అనిపించవచ్చు కానీ అది క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితుల్లో విఫలం అయిపోవచ్చుఅందుకే ఆధారాలు చాలా ముఖ్యంఏఐ పని చేస్తుందా లేదా అని మాత్రమే కాకుండా.. అది ఎవరి కోసంఏ సందర్భాలలో పనిచేస్తుందిదాని వల్ల కలిగే ఫలితాలేమిటిఅని మనం ప్రశ్నించుకోవాలికచ్చితమైన మూల్యాంకనం లేకపోతేమనం ఉత్సాహాన్ని చూసి అదే ఫలితం అనుకొని పొరబడే ప్రమాదం ఉందిఏఐకి అపారమైన సామర్థ్యం ఉందికానీ దానిని వాస్తవ పరిస్థితుల్లో పరీక్షించినప్పుడుప్రజలనుఫలితాలను కేంద్రంగా చేసుకుని బాధ్యతాయుతంగా విస్తరించినప్పుడు మాత్రమే అది ఉపయోగపడుతుంది” అని అన్నారు.

షికాగో విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యులు మైఖేల్ క్రెమర్ మాట్లాడుతూ.. ‘‘ట్రాఫిక్ నిబంధనల అమలుఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్షలుఆరోగ్యంవిద్య తదితర రంగాల్లో ఏఐ అందిస్తున్న సానుకూల ప్రభావాలను మనం ఇప్పటికే ఆధారాలతో సహా చూస్తున్నాంముఖ్యంగా విద్యార్థుల వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన అధ్యయన ప్రక్రియ ద్వారావారానికి కేవలం ఒక్క గంట కేటాయించినప్పటికీఅభ్యాసంలో వారి వేగం రెట్టింపు అయ్యిందిఅయితే దీనికి సాంకేతికత మాత్రమే సరిపోదుప్రభుత్వ సేవలను మెరుగుపరచడమనేది ప్రతి సందర్భంలోనూ ప్రోత్సాహకాలతో కూడిన మార్కెట్ కాకపోవచ్చుఅందుకే ఈ అంశంలో దాతృత్వ సంస్థలుప్రభుత్వం కీలక పాత్ర పోషించాలిప్రభుత్వ వ్యవస్థల్లో మార్పులను స్వీకరించడం అంత సులభం కాదుకొనుగోలు ప్రక్రియలు కూడా ప్రధానమైనవేఒక దేశం నుంచి మరొక దేశం నేర్చుకోవడానికి ఈ మూల్యాంకనం ఎంతో కీలకంఏఐకి అద్భుతమైన సామర్థ్యం ఉందికానీ అది సాకారం కావాలంటే ఆధారాలువ్యవస్థాగత మార్పులుజాగ్రత్తగా అమలు చేయడం లాంటివి అవసరం.

సదస్సు విస్తృత ఎజెండాలో ఈ కార్యక్రమం కీలకమైన భాగంగా నిలిచిందిపెద్ద ఎత్తున అమలు చేయగల పౌర అప్లికేషన్‌లుగా ఏఐ సామర్థ్యాలను ఎలా మార్చాలనే అంశంపై చర్చించేందుకు విధాన నిర్ణేతలనుపరిశోధకులనుపరిశ్రమ ప్రముఖులను ఈ వేదిక ఒక చోట చేర్చిందిఏఐ ఆధారిత సేవలను ముందుకు తీసుకెళ్లడంలో నిర్మాణాత్మకమైన అమలు విధానంవివిధ రంగాల మధ్య సమన్వయం ఎంత ప్రధానమైనవో ఈ చర్చలు తెలియజేశాయి.

 

***


(రిలీజ్ ఐడి: 2229340) సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Gujarati , Odia , Kannada , Malayalam