ప్రధాన మంత్రి కార్యాలయం
వేద జ్ఞానాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
12 FEB 2026 10:15AM by PIB Hyderabad
అజరామరమైన వేద జ్ఞానాన్ని తెలియజేసే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
"ఊర్ధ్వమూలమదఃశాఖమాశ్వత్థం ప్రాహురవ్యయమ్
ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్"
"ఈ జగత్తు శాశ్వతమైన రావిచెట్టు వంటిది. దాని వేర్లు పైభాగంలో, శాఖలు కిందకి విస్తరించి ఉంటాయి. వేదాలు ఆకుల వంటివి. అటువంటి ఈ జగత్ వృక్ష స్వరూపాన్ని యథార్థంగా గ్రహించిన వారే నిజమైన జ్ఞానులు" అని ఈ సుభాషితం తెలియజేస్తుంది.
జ్ఞానదీపం.. అజ్ఞానమనే చీకటిని తొలగించటమే కాక, యావత్ ప్రపంచానికి వెలుగునిస్తుందని, మహర్షి దయానంద సరస్వతి గారే ఇందుకు సజీవ నిదర్శనమని శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"జ్ఞానదీపం.. అజ్ఞానమనే చీకటిని తొలగించటమే కాకుండా, సమస్త జగత్తును ప్రకాశింపజేస్తుంది. మహర్షి దయానంద సరస్వతి గారి దివ్యమైన వ్యక్తిత్వం దీనికి సజీవ నిదర్శనం.
***
(రిలీజ్ ఐడి: 2227054)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam