ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఐటీ సంస్థలు సేఫ్ హార్బర్ను పొందేలా రూ.300 కోట్ల నుంచి రూ.2000 కోట్లకు పరిమితి పెంపు
ఆటోమేటెడ్ నియమ ఆధారిత ప్రక్రియ ద్వారా ఐటీ సేవల సేఫ్ హార్బర్ ధ్రువీకరణ
प्रविष्टि तिथि:
01 FEB 2026 12:57PM by PIB Hyderabad
కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2026-27ను ఈ రోజు పార్లమెంటులో ప్రవేశపెట్టారు.
సాఫ్ట్వేర్ రూపకల్పనకు సంబంధించిన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సేవలు, ఐటీ ఆధారిత సేవలు, నాలెడ్జి ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ సేవలు, కాంట్రాక్టు ఆర్ అండ్ డీ సేవల్లో భారత్ ప్రపంచ అగ్రగామిగా ఉందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అన్నారు. ఈ వ్యాపార విభాగాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్నాయి. ఈ సేవలన్నింటినీ ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్’ పేరుతో ఒకే విభాగం పరిధిలోకి తీసుకురావాలని, వీటిన్నింటికీ ఒకే విధమైన సేఫ్ హార్బర్ మార్జిన్ను 15.5 శాతం వర్తింప చేయాలని ప్రతిపాదించారు. ఐటీ సేవల్లో సేఫ్ హార్బర్ను పొందడానికి పరిమితిని కేంద్ర బడ్జెట్ 2026-27లో రూ. 300 కోట్ల నుంచి రూ. 2,000 కోట్లకు పెంచారు.

ఐటీ సేవల రంగంలో అందించే సేఫ్ హార్బర్ సేవలకు ఇకపై ఆటోమేటెడ్ నియమ ఆధారిత ప్రక్రియ ద్వారా ఆమోదం లభిస్తుందని ఆర్థికమంత్రి తెలియజేశారు. దీని కోసం పన్ను అధికారి దరఖాస్తును పరిశీలించాల్సిన, ఆమోదించాల్సిన అవసరం ఉండదన్నారు. ఐటీ సేవల సంస్థ ఒకసారి సేఫ్ హార్బర్కు దరఖాస్తు చేసుకుంటే.. తమ ఇష్టానుగుణంగా అయిదేళ్ల కాల వ్యవధి వరకు దానిని కొనసాగించవచ్చు.
అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ (ఏపీఏ)ను పూర్తి చేయాలనుకొనే ఐటీ సంస్థల కోసం ఫాస్ట్ ట్రాక్ యూనిలేటరల్ ఏపీఏ ప్రక్రియలను ప్రకటించారు. దీనిని రెండేళ్ల కాల వ్యవధిలో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. పన్ను చెల్లింపుదారుల అభ్యర్థన మేరకు ఈ రెండేళ్ల సమయాన్ని మరో ఆరు నెలలు పొడిగించుకోవచ్చు. సవరించిన రిటర్నులు ఏపీఏలో నమోదయ్యే సంస్థతో పాటు దాని అనుబంధ సంస్థలకు కూడా వర్తిస్తాయి.
***
(रिलीज़ आईडी: 2221638)
आगंतुक पटल : 18
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Gujarati
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam