ప్రధాన మంత్రి కార్యాలయం
మణిపూర్ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
प्रविष्टि तिथि:
21 JAN 2026 9:24AM by PIB Hyderabad
ఈ రోజు మణిపూర్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాస్ట్ర సోదరీ సోదరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మణిపూర్ ప్రజలు తమ అంకితభావం, కఠోర శ్రమతో దేశ పురోగతిని ముందుకు తీసుకెళ్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. క్రీడల పట్ల ఆ రాష్ట్రానికి ఉన్న మక్కువ, గొప్ప సాంస్కృతిక వారసత్వం, ప్రకృతితో గాఢమైన అనుబంధం నిజంగా ప్రశంసనీయమన్నారు.
మున్ముందు మణిపూర్ అభివృద్ధి పథంలో స్థిరంగా ముందుకు సాగుతుందని ప్రధానమంత్రి ధీమా వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
“మణిపూర్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర సోదరీ సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మణిపూర్ ప్రజలు దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్తున్నారు. క్రీడల పట్ల ఆ రాష్ట్రానికి ఉన్న మక్కువ, అక్కడి సంస్కృతి, ప్రకృతితో అనుబంధం నిజంగా ప్రశంసనీయమైనవి. మున్ముందు అభివృద్ధి పథంలో మణిపూర్ స్థిరంగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను.”
***
(रिलीज़ आईडी: 2216725)
आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam