ప్రధాన మంత్రి కార్యాలయం
జ్ఞాన సారాన్ని గ్రహించడానికున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
20 JAN 2026 10:36AM by PIB Hyderabad
అపారమైన జ్ఞానం, పరిమిత సమయం మధ్య సారాంశాన్ని గ్రహించడంపై దృష్టిని కేంద్రీకరించడమే శాశ్వత వివేకమని సూచిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు.
‘అనంతశాస్త్రం బహులాశ్చ విద్యా: అల్పశ్చ కాలో బహువిఘ్నతా చ
యత్సారభూతం తదుపాసనీయం హంసో యథా క్షీరమివాంబుమధ్యాత్’ అనే సంస్కృత శ్లోకాన్ని ఆయన ఉదహరించారు. వివేకాన్ని సంపాదించుకోవడానికి జ్ఞాన బోధ చేసే ధర్మగ్రంథాలు, విద్యలు అనేకంగా ఉండగా, మానవ జీవిత కాలం పరిమితంగానే ఉంది.. పైగా అనేక విఘ్నాలు ఎదురవుతుంటాయి; కాబట్టి ఎవరైనా... నీటిని వేరు చేసి కేవలం పాలను స్వీకరించే హంస వలె నడుచుకోవాలి.. ఈ శాస్త్రాల్లో ఉన్న తత్త్వాల సారాన్ని అంటే.. పరమ సత్యాన్ని.. మాత్రమే సూక్ష్మ పరిశీలనతో గ్రహించాలి అనే సందేశాన్ని ఈ శ్లోకం మనకు అందిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘అనంతశాస్త్రం బహులాశ్చ విద్యా: అల్పశ్చ కాలో బహువిఘ్నతా చ
యత్సారభూతం తదుపాసనీయం హంసో యథా క్షీరమివాంబుమధ్యాత్’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2216400)
आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam