ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్-2025లో కాంస్య పతకం సాధించిన అర్జున్ ఇరిగేశిని అభినందించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
29 DEC 2025 3:15PM by PIB Hyderabad
దోహాలో జరిగిన ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఓపెన్ విభాగంలో కాంస్య పతకాన్ని సాధించిన అర్జున్ ఇరిగేశిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. అతని పట్టుదల ప్రశంసనీయం. అతని భవిష్యత్ ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నానని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
"దోహాలో జరిగిన ఫిడే ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో ఓపెన్ విభాగంలో అర్జున్ ఇరిగేశి కాంస్య పతకాన్ని సాధించటం గర్వంగా ఉంది. అతని పట్టుదల గర్వించదగినది. భవిష్యత్తులో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా"
(रिलीज़ आईडी: 2209694)
आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Malayalam
,
Kannada
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati