హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్- న్యూజిలాండ్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ప్రశంసించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి

మోదీ ప్రభుత్వ వాణిజ్య దౌత్యం కొత్త మైలురాళ్లను నిర్దేశిస్తోందన్న హోం మంత్రి

భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకువస్తుందన్న హోం మంత్రి

భారతీయ ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, రైతులు, ఎంఎస్ఎంఈలు, విద్యార్థులు, యువతకు ఈ ఎఫ్‌టీఏ లాభదాయకమైన అవకాశాలను కల్పించటంతో పాటు సంపదకు కొత్త ద్వారాలను తెరుస్తుందన్న శ్రీ అమిత్ షా

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో అనుసరిస్తోన్న పౌర కేంద్రీకృత విదేశాంగ విధానం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే తీరుకు గొప్ప ఉదాహరణ: శ్రీ అమిత్ షా

నాడు పోస్టు చేయడమైనది: 22 DEC 2025 7:58PM by PIB Hyderabad

భారత్-న్యూజిలాండ్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏకేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ప్రశంసించారువాణిజ్య దౌత్యం విషయంలో మోదీ ప్రభుత్వం కొత్త మైలురాళ్లను నిర్దేశిస్తోందని ఆయన అన్నారు

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు:

మోదీ ప్రభుత్వ వాణిజ్య దౌత్యం కొత్త మైలురాళ్లను నిర్దేశిస్తోంది

సుమారు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులను తీసుకువచ్చే భారత్-న్యూజిలాండ్ ఎఫ్‌టీఏ.. భారతీయ ఆవిష్కర్తలుపారిశ్రామికవేత్తలురైతులుఎంఎస్ఎంఈలువిద్యార్థులుయువతకు లాభదాయకమైన అవకాశాలను అందిస్తూ సంపదకు కొత్త ద్వారాలను తెరుస్తుందిప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో పౌర కేంద్రీకృత విదేశాంగ విధానం ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే తీరుకు ఒక ‘మంచి ఉదాహరణ’ ”


(రిలీజ్ ఐడి: 2207568) సందర్శకుల సూచీ సంఖ్య : : 39
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam