సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, డీప్ ఫేక్ లను అరికట్టేందుకు వ్యవస్థను బలోపేతం చేసిన ప్రభుత్వం


సృజనాత్మక స్వేచ్ఛను కాపాడుతూనే తప్పుదారి పట్టించే సమాచారంపై ప్రభుత్వం చర్యలు

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాస్తవ సమాచారాన్ని ధ్రువీకరించి,

నకిలీ వార్తలను తొలగించనున్న పీఐబీ ఫాక్ట్ చెక్ యూనిట్

प्रविष्टि तिथि: 12 DEC 2025 2:06PM by PIB Hyderabad

రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) ప్రకారం పౌరులకు భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందిఅయితే సామాజిక మాధ్యమాల్లో నకిలీతప్పుడుతప్పుదోవ పట్టించే సమాచారంకృత్రిమ మేధ ఆధారంగా సృష్టించే డీప్ ఫేక్‌ సంఘటనలు పెరుగుతుండటం.. ప్రజాస్వామ్య విధానాన్నిశాంతిభద్రతలను దెబ్బతీసే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించింది.

నకిలీ వార్తలను సాధారణంగా తప్పుడుతప్పుదారి పట్టించే సమాచారంగా పేర్కొంటారుదీనిని వార్తగా ప్రసారం చేస్తారువివిధ సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి హానికరమైన సమాచారాన్ని నిషేధించడానికి.. ఇప్పటికే దేశంలో విస్తృత చట్టబద్ధమైనసంస్థాగత వ్యవస్థ పని చేస్తోంది.


 

ఎలక్ట్రానిక్ మీడియా

  • కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (నియంత్రణచట్టం 1995 ప్రకారం టీవీ ఛానెళ్లు ప్రోగ్రామ్ కోడ్‌ను అనుసరిస్తాయి.

  • ఇది అశ్లీలమైనపరువు నష్టం కలిగించేఉద్దేశపూర్వకంగా తప్పదోవ పట్టించే సమాచారంసూచనాత్మక సంకేతాలుఅర్ధ సత్యాలను కలిగిన ప్రసారాలను నిషేధిస్తుంది.

  • ఈ చట్టం కింద రూపొందించిన నిబంధనల ఉల్లంఘనలను పరిష్కరించడానికి మూడు దశల ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేసింది.

  • మొదటి దశ..ప్రసారకుల స్వీయ నియంత్రణ

  • రెండో దశ..ప్రసారకుల స్వీయ నియంత్రణ సంస్థల ద్వారా నియంత్రణ

  • మూడో దశ..కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ వ్యవస్థ

ప్రోగ్రాం కోడ్ ఉల్లంఘనలను సలహాలుహెచ్చరికలుక్షమాపణలు చెప్పడంతాత్కాలిక ప్రసారాల నిలిపివేత వంటి చర్యల ద్వారా పరిష్కరిస్తారు.

ప్రింట్ మీడియా

  • భారత ప్రెస్ కౌన్సిల్ జారీ చేసిన పత్రికా ప్రవర్తనా నిబంధనలు.. తప్పుడుకించపరచేతప్పుదారి పట్టించే వార్తల ప్రచురణను నిరోధిస్తుంది.

  • ఈ నిబంధనల ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులను పీసీఐ దర్యాప్తు చేస్తుంది.

  • ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించిన తరువాత పత్రికలుసంపాదకులుపాత్రికేయులు మొదలైన వారిని హెచ్చరించడంమందలించడంనిందించడం వంటి చర్యలు తీసుకుంటుంది.

డిజిటల్ మీడియా

డిజిటల్ మీడియాలో వార్తలు సమకాలీన విషయాలను ప్రచురించే వారి కోసం సమాచారసాంకేతికత నియమాలు 2021 కింద ప్రత్యేక నైతిక నియమావళిని రూపొందించారు.

  • ఫేస్ బుక్యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే సమాచారంఅసత్యపు వార్తలను నిరోధించాలి.

  • నైతిక నియమావళికి కట్టుబడి ఉండేందుకు మూడు-దశల ఫిర్యాదు పరిష్కార యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు.

  • తప్పుడుపరువు నష్టం కలిగించే సమాచారానికి సంబంధించిన ఫిర్యాదులను నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించడానికి సామాజిక మాధ్యమాలు తప్పనిసరిగా ఒక ఫిర్యాదు అధికారిని నియమించాలి.

  • ఐటీ నిబంధనల రెండో భాగం ప్రకారం తప్పుడుఅసత్యమైనతప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చెందకుండా నిరోధించాల్సిన బాధ్యతను మధ్యవర్తి సంస్థలపై ఉంటుంది.


 

దేశ సార్వభౌమత్వంసమగ్రతదేశ రక్షణరాష్ట్ర భద్రతవిదేశాలతో స్నేహపూర్వక సంబంధాలుశాంతి భద్రతల ప్రయోజనాల దృష్ట్యా.. లేదా పై అంశాలకు సంబంధించిన ఏదైనా శిక్షార్హమైన నేరం చేసేందుకు ప్రేరేపించడాన్ని నిరోధించేందుకు సమాచార సాంకేతికత చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ప్రభుత్వం ఆదేశాలను జారీ చేస్తుంది.

ఫ్యాక్ట్ చెక్ యూనిట్

కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నకిలీ వార్తలను పరిశీలించేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కింద ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటైంది.

  • ఇది భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలువిభాగాల్లోని అధికారుల నుంచి వచ్చే వార్తల ప్రామాణికతను ధ్రువీకరిస్తుంది.

  • సమాచారం సరిగా ఉందని నిర్ధారించిన తరువాత ఎఫ్ సీయూ తన సామాజిక మాధ్యమ వేదికలపై ప్రచురిస్తుంది.

సమాజానికి అండగా నిలిచే సంస్థలనునమ్మకాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందితప్పుడు సమాచారం వల్ల కలిగే హానిని పరిష్కరిస్తూనే.. సృజనాత్మక స్వేచ్ఛను కాపాడటం దీని విధానం.

రాజ్యసభలో శ్రీ మోహమ్మద్ నదీముల్ హక్క్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్ర సమాచారప్రసారశాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ఈ సమాచారాన్ని నేడు సమర్పించారు.

 

***


(रिलीज़ आईडी: 2203367) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam