ప్రధాన మంత్రి కార్యాలయం
భవిష్యత్ ఆవిష్కరణ రంగాల్లో కాగ్నిజెంట్ భాగస్వామ్యాన్ని స్వాగతించిన ప్రధాని
प्रविष्टि तिथि:
09 DEC 2025 9:13PM by PIB Hyderabad
కాగ్నిజెంట్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ రవి కుమార్ ఎస్, ఛైర్మన్- మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాజేష్ వరియర్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు.
భవిష్యత్తును ఆవిష్కరించే రంగాల్లో భారతదేశ పురోగతికి కాగ్నిజెంట్ అందిస్తోన్న నిరంతర భాగస్వామ్యాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా స్వాగతించారు. కృత్రిమ మేధ, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారిస్తోన్న భారత యువత దేశ సాంకేతిక భవిష్యత్తును తీర్చిదిద్దే భాగస్వామ్యానికి బాటలు వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కాగ్నిజెంట్ చేసిన పోస్ట్పై ఆయన ఈ విధంగా స్పందించారు:
"శ్రీ రవి కుమార్ ఎస్, శ్రీ రాజేష్ వారియర్తో సమావేశం అద్భుతంగా జరిగింది. భవిష్యత్తును ఆవిష్కరించే రంగాల్లో కాగ్నిజెంట్ అందిస్తోన్న నిరంతర భాగస్వామ్యాన్ని భారత్ స్వాగతిస్తోంది. కృత్రిమ మేధ, నైపుణ్యాభివృద్ధిపై మన యువత దృష్టి సారించడం అనేది రాబోయే భాగస్వామ్యానికి బాటలు వేస్తోంది"
(रिलीज़ आईडी: 2201180)
आगंतुक पटल : 7