ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌లో రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించిన అనంతరం ప్రధానమంత్రి ప్రసంగం

प्रविष्टि तिथि: 14 SEP 2023 5:38PM by PIB Hyderabad

ఛత్తీస్‌గఢ్‌ డిప్యూటీ సీఎం శ్రీ టి.ఎస్సింగ్ దేవ్ జీకేంద్ర మంత్రివర్గంలో నా సహోద్యోగిని శ్రీమతి రేణుకా సింగ్ జీగౌరవ ఎంపీలుఎమ్మెల్యేలునా ప్రియమైన ఛత్తీస్‌గఢ్ కుటుంబ సభ్యులారా!

అభివృద్ధి దిశగా ఛత్తీస్‌గఢ్‌ ఇవాళ మరో కీలక అడుగు వేస్తోందిరూ.6,400 కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులను బహుమతిగా అందుకుందివిద్యుత్ ఉత్పత్తి రంగంలో ఛత్తీస్‌గఢ్‌ సామర్థ్యాన్ని పెంచటానికిఆరోగ్య రంగంలో మరింత పురోగతికి నూతన పథకాలను ఇవాళ ప్రారంభించాంసికిల్ సెల్ కౌన్సెలింగ్ కార్డులు కూడా ఇవాళ పంపిణీ చేశాం.

మిత్రులారా,

వేగవంతమైన ఆర్థికాభివృద్ధిపేదలకు భారత్ అందించే సంక్షేమ నమూనాను ప్రపంచం గమనిస్తూఅభినందిస్తోందికొద్ది రోజుల క్రితం జరిగిన జీ-20 సదస్సు సందర్భంగా కొన్ని ముఖ్యమైన దేశాల నుంచి అధినేతలు ఢిల్లీకి వచ్చిన విషయం మీకు తెలిసిందేభారతదేశ అభివృద్ధికిపేదల సంక్షేమానికి చేస్తున్న కృషిని చూసి వారంతా ముగ్ధులయ్యారుభారత్ సాధించిన విజయ పాఠాలను నేర్చుకోవాలని ప్రపంచంలోని ప్రధాన సంస్థలు కోరుకుంటున్నాయిఅభివృద్ధి విషయంలో ఇవాళ దేశంలోని ప్రతి రాష్ట్రానికిప్రతి ప్రాంతానికి సమ ప్రాధాన్యత లభించటమే ఇందుకు కారణంఉప ముఖ్యమంత్రి చెప్పినట్లుగా కలిసికట్టుగా మనం దేశాన్ని ముందుకు నడిపించాలిఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ దీనికి సాక్ష్యంగా నిలుస్తుందిఈ అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో మీ అందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.

నా కుటుంబ సభ్యులారా,

దేశాభివృద్ధికి ఛత్తీస్‌గఢ్‌ శక్తి కేంద్రం వంటిదిశక్తి కేంద్రాలు పూర్తి సామర్థ్యంతో పనిచేసినప్పుడే దేశం కూడా ముందుకు సాగేందుకు బలాన్ని పొందుతుందిఈ ఆలోచనతోనే ఏళ్లుగా ఛత్తీస్‌గఢ్‌ సమగ్రాభివృద్ధికి అలుపెరుగని కృషి చేశాంఆ దార్శనికతవిధానాల ఫలితాలను ఇవాళ చూడవచ్చుఇవాళ ఛత్తీస్‌గఢ్‌లో కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాలు ప్రతి రంగంలోనూ పూర్తిగా అమలవుతున్నాయినూతన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయిమీకు గుర్తుండే ఉంటుంది.. జూలై నెలలోనే అభివృద్ధి ప్రాజెక్టుల కోసం నేను రాయ్‌పూర్ వచ్చానుఆ సమయంలో విశాఖపట్నం-రాయ్‌పూర్‌ ఎకనామిక్ కారిడార్రాయ్‌పూర్-ధన్‌బాద్‌ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసే అదృష్టం కలిగిందిఎన్నో ముఖ్యమైన జాతీయ రహదారులు కూడా మీ రాష్ట్రానికి బహుమతిగా లభించాయిఇవాళ రైలు వ్యవస్థలో అభివృద్ధికిఛత్తీస్‌గఢ్‌ నూతన అధ్యాయాన్ని లిఖిస్తోందిబిలాస్‌పూర్‌-ముంబై రైల్వే లైన్‌లోని ఝార్సుగూడ-బిలాస్‌పూర్‌ సెక్షన్‌లో రద్దీని ఈ రైలు నెట్‌వర్క్‌ తగ్గిస్తుందిప్రారంభం కానున్ననిర్మాణంలో ఉన్న రైల్వేలైన్లురైలు కారిడార్లు ఛత్తీస్‌గఢ్ పారిశ్రామికాభివృద్ధిని కొత్త శిఖరాలకు చేర్చుతాయిఈ మార్గాల్లో పనులు పూర్తయితే ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు ప్రయోజనకరంగా ఉండటమే కాకనూతన ఉపాధిఆదాయావకాశాలు లభిస్తాయి.

మిత్రులారా,

కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల కారణంగా దేశానికి శక్తి కేంద్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌ ఎన్నో రెట్లు బలపడుతుందిబొగ్గు గనుల నుంచి విద్యుత్ కేంద్రాలకు బొగ్గు రవాణా ఖర్చురవాణా సమయం తగ్గుతున్నాయితక్కువ ఖర్చుతో ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేయటానికి పిట్ హెడ్ థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రభుత్వం నిర్మిస్తోందితలైపల్లి గనిని అనుసంధానించే 65 కి.మీమేరీ గో రౌండ్ ప్రాజెక్టు కూడా ప్రారంభమైందిదేశంలో ఇలాంటి ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతోందివీటివల్ల ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలు అత్యధికంగా ప్రయోజనం పొందుతాయి.

నా కుటుంబ సభ్యులారా,

రాబోయే 25 ఏళ్లు 'అమృత్ కాల్సమయంలో దేశాన్ని అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చుకోవాలిప్రతి పౌరుడి సమాన భాగస్వామ్యం ద్వారా దీన్ని సాధించగలందేశ ఇంధన అవసరాలను తీర్చుకుంటూపర్యావరణాన్ని పరిరక్షించుకోవాలిఇందులో భాగంగా సూరజ్‌పూర్ జిల్లాలో మూసివేసిన బొగ్గు గనిని ఎకో-టూరిజానికి అభివృద్ధి చేశారుకోర్వా ప్రాంతంలోనూ ఎకో-పార్కు అభివృద్ధి పని జరుగుతోందిగనుల నుంచి విడుదలయ్యే నీటితో ఇవాళ వేలాది మంది ప్రజలకు సాగుతాగునీటి సౌకర్యం కల్పిస్తున్నాంఈ ప్రయత్నాల ద్వారా గిరిజన ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరుతుంది.

మిత్రులారా,

అడవులనుభూమిని రక్షించటంతో పాటు అటవీ సంపద ద్వారా సంక్షేమ మార్గాలను చూపాలన్నదే మా దృఢ సంకల్పందేశంలో లక్షలాది మంది గిరిజన యువత వన ధన్ వికాస్ యోజన ద్వారా లబ్ధి పొందుతున్నారుఈ ఏడాది ప్రపంచంమిల్లెట్ సంవత్సరాన్ని జరుపుకుంటోందిరాబోయే ఏళ్లలో మన ధాన్యాలుచిరుధాన్యాలు విస్తారమైన మార్కెట్‌ను సృష్టించగలవుదేశంలో ఒకవైపు గిరిజన సంప్రదాయానికి కొత్త గుర్తింపు లభిస్తుండగామరోవైపు అభివృద్ధికి నూతన మార్గాలు తెరుచుకుంటున్నాయి.

నా కుటుంబ సభ్యులారా,

ఇక్కడ ఇవాళ పంపిణీ చేసిన సికిల్ సెల్ ఎనీమియా కౌన్సెలింగ్ కార్డులు కూడా గొప్ప సేవలను అందిస్తాయిముఖ్యంగా గిరిజన సమాజానికి సేవలు అందుతాయిసికిల్ సెల్ ఎనీమియాతో మన గిరిజన సోదరీసోదరులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారుసరైన అవగాహనతో ఈ వ్యాధిని నియంత్రించవచ్చు. 'సబ్‌ కా సాథ్‌సబ్‌ కా వికాస్సంకల్పంతో మనం ముందుకు సాగాలిఛత్తీస్‌గఢ్ అభివృద్ధికి భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని నేను విశ్వసిస్తున్నానుఈ సంకల్పంతో అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలుతదుపరి కార్యక్రమంలో నేను కొన్ని విషయాలను వివరిస్తానుఇది ఈనాటి కార్యక్రమం

ధన్యవాదాలు!

 

***


(रिलीज़ आईडी: 2200044) आगंतुक पटल : 12
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam