సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రసార సేవలు (నియంత్రణ బిల్లు) 2023: ముగిసిన వాటాదారుల సంప్రదింపులు..


విస్తృత, సమగ్ర సంప్రదింపులపై ప్రభుత్వానికి నమ్మకం ఉంది:

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్ మురుగన్

నాడు పోస్టు చేయడమైనది: 05 DEC 2025 1:47PM by PIB Hyderabad

ప్రసార సేవల (నియంత్రణబిల్లు 2023 (బీఎస్ఆర్ బిల్లుముసాయిదాను 10.11.2023న ప్రజలకు అందుబాటులో ఉంచారుసాధారణ ప్రజలుభాగస్వాముల నుంచి 09.12.2023 వరకు అభిప్రాయాలుస్పందనలుసూచనలను కోరారుతదనంతరం ఈ తేదీని15.01.2024 వరకు పొడిగించారు.

మీడియావినోద పరిశ్రమ సంఘాలతో సహా వాటాదారుల నుంచి అందిన సూచనల ఆధారంగా అభిప్రాయాలను తెలియజేసేందుకు గడువును 15.10.2024 వరకు ప్రభుత్వం పొడిగించింది.

వాటాదారులందరి నుంచి వచ్చిన సూచనలను పరిశీలించారు. విస్తృతమైనసమగ్రమైన సంప్రదింపులను ప్రభుత్వం విశ్వసిస్తోందని మంత్రి తెలిపారు.

శ్రీ సాకేత్ గోఖలే అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమాచారప్రసార శాఖపార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ఈ సమాచారాన్ని ఇవాళ రాజ్యసభలో అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2199677) సందర్శకుల సూచీ సంఖ్య : : 34
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Bengali-TR , Tamil , Kannada