ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రోజ్ గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఇవాళ్టి నియామకాలు కేవలం ప్రభుత్వోద్యోగాలు మాత్రమే కాదు..

దేశ నిర్మాణానికి సహకరించేందుకు దొరికిన అవకాశాలు: పీఎం

యువత విజయమే, దేశాభివృద్ధి: పీఎం

రోజ్ గార్ మేళాల ద్వారా 11 లక్షలకు పైగా నియామక పత్రాలను అందించిన ప్రభుత్వం: పీఎం

దీపావళి సందర్భంగా రికార్డు స్థాయిలో నమోదైన అమ్మకాలు, జీఎస్టీ పొదుపు ఉత్సవం కారణంగా

డిమాండ్, ఉత్పత్తి, ఉపాధి కల్పనలో ఉత్తేజం: పీఎం

యూపీఎస్సీ ప్రతిభావంతుల కృషి వృథా కాకుండా ప్రతిభా సేతు పోర్టల్ ద్వారా తిరిగి దేశ నిర్మాణానికి వినియోగం: పీఎం

అభివృద్ధి చెందిన భారత్ దిశగా ప్రయాణానికి యువ కర్మయోగుల నాయకత్వం: పీఎం

Posted On: 24 OCT 2025 12:27PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ రోజ్ గార్ మేళాను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారుదీపాల పండగ దీపావళి ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపిందని ప్రధానమంత్రి అన్నారుపండగ సంబరాల సందర్భంగా శాశ్వత ఉద్యోగ నియామక పత్రాలను అందుకోవటం ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నారుఒకవైపు పండగ సంతోషంమరోవైపు ఉపాధి విజయం రెండూ లభించాయిదేశవ్యాప్తంగా ఇవాళ 51,000 వేల మందికి పైగా యువత సంతోషంగా ఉండటం వల్ల వారి కుటుంబాలు ఆనందంతో వెలిగిపోతున్నాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారుఈ సందర్భంగా నియామక పత్రాలను అందుకున్న వారందరికీవారి కుటుంబ సభ్యులకు అభినందనలు తెలిపారువారి జీవితాల్లో నూతన ప్రారంభానికి శుభాకాంక్షలు చెప్పారు.

కొత్తగా నియామక పత్రాలను పొందిన యువతలో ఉత్సాహంకష్టపడేతత్వంకలలు నెరవేరటంతో కలిగిన ఆత్మవిశ్వాసానికి దేశానికి సేవ చేయాలనే తపన తోడైనప్పుడు కలిగే విజయం కేవలం వ్యక్తిగత విజయంగా కాకదేశాభివృద్ధిగా మారుతుందని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారుఇవాళ జరుగుతున్న నియామకాలు కేవలం ప్రభుత్వోద్యోగాలు కాదు.. దేశ నిర్మాణంలో సహకరించటానికి లభించిన అవకాశాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారునూతనంగా నియమితులైన వారు నిజాయితీచిత్తశుద్ధితో పనిచేయాలని.. భవిష్యత్తులో భారత్ కోసం మెరుగైన వ్యవస్థలను రూపొందించటంలో కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 'నాగరిక దేవో భవఅనే మంత్రాన్ని గుర్తుపెట్టుకుని సేవాభావంఅంకితభావంతో పనిచేయాలని కొత్తగా నియామక పత్రాలను అందుకున్న వారికి ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.

"అభివృద్ధి చెందిన భారత్ ను నిర్మించాలనే సంకల్పంతో 11 ఏళ్లుగా దేశం ముందుకు సాగుతుండగాఈ ప్రయాణంలో యువత కీలక పాత్ర పోషిస్తోందిఅని ప్రధానమంత్రి స్పష్టం చేశారుయువ సాధికారతే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని తెలిపారుయువ భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చటంలో శక్తిమంతమైన వేదికలుగా రోజ్ గార్ మేళాలు మారినట్లు తెలిపారుఇటీవల కాలంలో ఈ మేళాల ద్వారా 11 లక్షలకు పైగా నియామక పత్రాలు జారీ అయ్యాయని తెలిపారుఈ ప్రయత్నాలు కేవలం ప్రభుత్వ ఉద్యోగాల కోసమే కాదనీ, 3.5 కోట్ల మంది యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో 'పీఎం వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన'ను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారుస్కిల్ ఇండియా మిషన్ వంటి కార్యక్రమాలు యువతకు అవసరమైన శిక్షణను అందిస్తున్నాయనినేషనల్ కెరీర్ సర్వీస్ వంటి వేదికల ద్వారా నూతన అవకాశాల గురించి తెలుసుకోవచ్చని ఆయన తెలిపారుఈ వేదిక ద్వారా ఇప్పటి వరకు కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగ ఖాళీల సమాచారాన్ని యువత తెలుసుకున్నారని వెల్లడించారు.

యువత కోసం ఒక ముఖ్యమైన కార్యక్రమం 'ప్రతిభా సేతు పోర్టల్'ను ప్రధానమంత్రి ప్రకటించారుయూపీఎస్సీ తుది పరీక్షల వరకు చేరుకునిఎంపిక కాని అభ్యర్థులకు ఈ పోర్టల్ అవకాశాలను అందిస్తుందిదీనివల్ల వారి కృషి వృథాగా పోదని ఆయన అన్నారుఈ పోర్టల్ ద్వారా ప్రతిభావంతులతో ప్రైవేటుప్రభుత్వ సంస్థలు కలిసి పనిచేస్తాయన్నారుఈ విధంగా యువ ప్రతిభను వినియోగించుకుని భారత యువ సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

జీఎస్టీ పొదుపు ఉత్సవంతో పండగ వాతావరణం మరింతగా ఉత్సాహంగా మారిందనిదేశవ్యాప్తంగా జీఎస్టీ పన్ను రేట్లు తగ్గించటం ఒక కీలకమైన సంస్కరణగా శ్రీ నరేంద్ర మోదీ చెప్పారుఈ సంస్కరణల ప్రభావం కేవలం వినియోగదారుల పొదుపునకు మాత్రమే పరిమితం కాలేదనిభవిష్యత్ తరం జీఎస్టీ సంస్కరణలు... ఉద్యోగావకాశాలను పెంచుతున్నాయని చెప్పారునిత్యవసర వస్తువుల ధరలు తగ్గితే డిమాండ్ పెరుగుతుందిగిరాకీ పెరిగితే ఉత్పత్తిసరఫరా వ్యవస్థల్లో వేగం పుంజుకుంటుందిఉత్పత్తి పెరగటం నూతన ఉద్యోగావకాలను సృష్టిస్తుందికాబట్టి జీఎస్టీ పొదుపు ఉత్సవ్ ఉపాధి పండుగగా మారుతుందిధన త్రయోదశిదీపావళి సమయంలో అమ్మకాలు రికార్డుల్ని బద్దలుకొట్టాయని ప్రధానమంత్రి వెల్లడించారుపాత రికార్డులు అధిగమించికొత్త రికార్డులు నెలకొల్పటంతో దేశ ఆర్థిక వ్యవస్థ ఊపందుకోవటాన్ని జీఎస్టీ సంస్కరణలు నిరూపించాయని ఆయన వివరించారుఎంఎస్ఎంఈలురిటైల్ వ్యాపారంపై ఈ సంస్కరణల సానుకూల ప్రభావం పడిందని.. తయారీలాజిస్టిక్స్ప్యాకేజింగ్పంపిణీ రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాలు వస్తున్నాయని ఆయన అన్నారు.

"ప్రపంచంలో అత్యంత యువ జనాభా కలిగిన దేశంగా భారత్ ఉందనియువత బలమే భారత్ కున్న గొప్ప ఆస్తుల్లో ఒకటిఅని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారుఈ నమ్మకం అన్ని రంగాల్లోముఖ్యంగా విదేశాంగ విధానంలో దేశ పురోగతికి మార్గనిర్దేశం చేస్తుందనియువ భారతీయుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విదేశాంగ విధానం రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారుదౌత్యపరమైన ఒప్పందాలుప్రపంచ దేశాలతో ఎంఓయూల్లో యువతకు శిక్షణనైపుణ్యాభివృద్ధిఉపాధి కల్పనకు సంబంధించిన అంశాలు పెరుగుతున్నాయని వెల్లడించారు

ఇటీవల యుకే ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా ఏఐఫిన్ టెక్క్లీన్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులను పెంచేందుకు ఇరుదేశాలు అంగీకరించాయని తెలిపారుకొన్ని నెలల కిందట భారత్యూకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కూడా నూతన అవకాశాలను తీసుకువస్తుందని చెప్పారుయూరోపియన్ దేశాలతో పెట్టుబడి భాగస్వామ్యాల ద్వారా వేలాదిగా కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారుబ్రెజిల్సింగపూర్కొరియాకెనడా వంటి దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాలు.. పెట్టుబడులను పెంచుతాయనిస్టార్టప్‌లుఎంఎస్‌ఎంఈలకు మద్దతునిస్తాయనిఎగుమతులను మరింతగా ప్రోత్సహిస్తాయనిప్రపంచ ప్రాజెక్టుల్లో యువత పనిచేయటానికి కొత్త అవకాశాలు ఏర్పడుతాయని శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఇవాళ మనం చర్చిస్తున్న విజయాలులక్ష్యాల కోసం కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న యువత రాబోయే కాలంలో గణనీయంగా సహకరిస్తారని ప్రధానమంత్రి స్పష్టం చేశారుఅభివృద్ధి చెందిన భారత్ లక్ష్య సాధనకు నిరంతరం కృషి చేయాల్సిన అవసరముందని తెలిపారుయువ కర్మయోగులు ఈ సంకల్పాన్ని నెరవేరుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారుఈ ప్రయాణంలో "-గాట్ కర్మయోగి వేదికఉపయోగాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావిస్తూఇప్పటికే దాదాపుగా 1.5 కోట్ల మంది ప్రభుత్వోద్యోగులు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకున్నారని తెలిపారుకొత్త ఉద్యోగులు కూడా ఈ వేదికలో చేరాలని ప్రధానమంత్రి ప్రోత్సహించారుతద్వారా నూతన పని సంస్కృతిసుపరిపాలన స్ఫూర్తి పెంపొందుతుందన్నారుకొత్తగా నియమితులైన వారి కృషి ద్వారానే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందనిపౌరుల కలలు సాకారమవుతాయని చెప్పారునియామక పత్రాలు పొందిన వారందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ముగించారు.

 

 

 

***

MJPS/SR


(Release ID: 2182247) Visitor Counter : 14