ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంటీగ్వా అండ్ బార్బుడా ప్రధానితో భేటీ అయిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
Posted On:
22 NOV 2024 3:29AM by PIB Hyderabad
భారత్-క్యారికోమ్ రెండో శిఖరాగ్ర సదస్సును గయానాలోని జార్జిటౌన్లో నవంబరు 20న నిర్వహించిన సందర్భంగా, ఆంటీగ్వా అండ్ బార్బుడా ప్రధాని శ్రీ గేస్టన్ బ్రౌన్తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
వాణిజ్యం, పెట్టుబడి రంగాలతో పాటు ఎస్ఐడీఎస్ కోసం సామర్థ్యాలను పెంచే అంశంలో ద్వైపాక్షిక సహకారంపై కూడా నేతలిద్దరూ చర్చించారు. భారత్-క్యారికోమ్ భాగస్వామ్యాన్ని బలపరచడానికి ప్రధానమంత్రి ప్రతిపాదించిన ఏడు అంశాల ప్రణాళికను ప్రధాని శ్రీ బ్రౌన్ ప్రశంసించారు. ఐరాస భద్రతామండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వాన్నిచ్చే అంశంలో ఆయన తన మద్దతును మరోసారి ప్రకటించారు.
(Release ID: 2176533)
Visitor Counter : 4
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam